తెలుగు రాష్ట్రాల ప్రజలని కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్ కామెడీ షో లో నాగబాబు కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుల చేర్పులు చేయడం వలన ఈ షో మరింత హాస్యభరితంగా మారబోతుందని నాగబాబు చెప్తున్నారంట. ఇప్పటికే 10 టీంలు, వాటి లీడర్స్,  ఇంకా కంటెస్టెంట్స్ సంవత్సరాల తరబడి ఈ షో లో నటిస్తూ హాస్యం చేయడంలో బాగా ముదుర్లు అయ్యారు. గత కొన్ని ఏళ్లగా జబర్దస్త్ షో కూడా క్రమక్రమంగా ఇంప్రూవ్‌మెంట్ అవుతూ వచ్చింది. మంచి కాస్ట్యూమ్స్.... చాలా రిచ్ లుక్ గా మారాయి జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లో ప్రెసెంట్ చేసే స్కిట్లు. 


ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు అయిపోవడంతో బాగా ఫ్రీ అయ్యిన నాగబాబు, రోజా జబర్దస్త్ షో పై ఎక్కువ సమయం కేటాయించి దానిని ఓ రేంజ్ కి తీసుకెళ్లాలని చుస్తున్నారంట. అయితే ఈ కామెడీ షో లో బాగా నవ్వించే చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్/ఆటో రాంప్రసాద్, రాకెట్ రాఘవ ల టీమ్ ల పై శ్రద్ధ పెడుతున్నారంట. నిజానికి ఈ నలుగురి టీమ్ లు జబర్దస్త్ కి మూల స్థంభాల్లా ఉన్నాయి. 


అందుకే ఈ ప్రధానమైన టీమ్ లు తప్పనిసరిగా 10 నిమిషాలకు తగ్గకుండా స్కిట్ చెయ్యాలనే కండీషన్ పెట్టినట్లు సమాచారం. ఇంకేంటంటే.. ఈ 4 టీమ్స్ మంచి స్కిట్లని ఎంచుకొని వాటిని ఫుల్ల్ ప్లెడ్జ్ గా చేయాలంటూ నిబంధన పెట్టినట్లు తెలుస్తుంది. అందుకే ఇకపై జబర్దస్త్ లో పెద్ద పెద్ద స్కిట్లు వస్తాయి. దీంతో ఈ షో మరింత హాస్యభరితంగా మారబోతుంది. ఇక మిగతా టీమ్ లు గురించి చెప్పాలంటే.. వారు కూడా జబర్దస్త్ షో, ఎక్సట్రా జబర్దస్త్ షో కి మంచి సపోర్ట్ గా ఉంటూ అడపాదడపా మంచి స్కిట్లు చేసి నవ్వులు కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: