టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న నటులు
సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ తరువాత ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు
సినిమా రంగంలోకి హీరోగా ప్రవేశించి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన రేంజ్ లో ఇమేజిని మాత్రం పొందలేకపోయారు. ఇక ఆయన చిన్న కుమారుడు
మహేష్ బాబు, చిన్నతనంలోనే బాలనటుడిగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని, పెరిగి పెద్దయ్యాక హీరోగా రంగప్రవేశం చేసి, ప్రస్తుతం
టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. వారి వంశం నుండి మహేష్ బావ సుధీర్ బాబు కూడా ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం మంచి పేరుతో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
అలానే యంగ్
హీరో రానా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఇకపోతే ఈ వేడుకకు
మహేష్ రాకపోవడానికి కారణం, ప్రస్తుతం ఆయన సరిలేరు నీకెవ్వరు షూటింగ్ నిమిత్తం కేరళలో ఉండడమేనని, బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది. కానీ తన సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా మేనల్లుడు
అశోక్ కి తన ఆశీస్సులు అందచేశారు మహేష్. మరి ఈ నూతన తరం ఘట్టమనేని వారసుడు ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి......!!