మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ‘అలా వైకుంఠపురంలో’ అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. నా పేరు సూర్య లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాపై అంచనాలు అభిమానుల భీభత్సంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని కళ్ళు చెదిరే విధంగా కలెక్షన్లు సాధించడంతో ‘అల వైకుంఠ పురంబులో’ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.


ఇప్పటికే ఈ సినిమాలో పాటలు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సామజ వర గమన సాంగ్ అల్లు అర్జున్ కెరీర్ లోనే మరియు సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ లోనే యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసింది. దీంతో మలయాళంలో అల్లు అర్జున్ కి అభిమానులు మరియు మంచి మార్కెట్ ఉండటంతో సామజ వర గమన మలయాళం సాంగ్ ఇటీవల సినిమా యూనిట్ విడుదల చేశారు. తెలుగులో మాదిరిగానే మలయాళంలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.


అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమిటంటే మలయాళ వర్షన్ లో సామజవరగమనా సాంగ్ కోసం సింగర్ ని మార్చేశాడు సంగీత దర్శకులు థమన్. మలయాళ వర్షన్ ని ప్రముఖ గాయకుడు యేసుదాస్ కొడుకు విజయ్ యేసుదాస్ చే పాడించారు. ఇప్పటికే మూడు వందల పాటలకు పైగా పాడిన విజయ్ ఈ పాటను సైతం అద్భుతంగా పాడారు. మలయాళంలో ఇప్పుడు సూపర్ డూపర్ గా అదరకొడుతున్న ఈ సాంగ్ మలయాళ ఇండస్ట్రీలో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా యూనిట్ ఈ సినిమా పాటల చిత్రీకరణ కోసం ఫ్రాన్స్ వెళ్లారు. పాటల చిత్రీకరణ అయిన వెంటనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: