టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్లు ఏది చెబితే అది చేసే హీరో అని మంచి పేరుంది. అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు చేయటానికి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు అవకాశాల కోసం తెగ తాపత్రయ పడతారు. ఇండస్ట్రీలో మహేష్ కి చాలా సైలెంట్ మరియు తన పని తాను చేసుకుని వెళ్లే మనిషి అని పక్కవారి జోలికి వెళ్లడం మహేష్ వ్యక్తిత్వంలో లేదని చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వారు అంటుంటారు. ఇటువంటి మహేష్ తాజాగా ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు టాప్ డైరెక్టర్లతో చెడిందని ఒక వార్త ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. విషయంలోకి వెళితే మెగా పవర్ స్టార్ charan TEJA' target='_blank' title='రామ్ చరణ్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామ్ చరణ్ తేజ కి రంగస్థలం లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ రంగస్థలం సినిమా విజయం తర్వాత మహేష్ బాబు కోసం దాదాపు యేడాది పాటు వెయిట్ చేసాడు.
అయితే కథ విషయంలో పదేపదే తిప్పించుకోవడం తో...అదే సమయంలో మహేష్ బాబు అనిల్ రావిపూడి తో సినిమాకి కమిట్ కావడంతో విసిగిపోయిన సుకుమార్ వెంటనే అల్లు అర్జున్ తో సినిమా ఉన్నట్లు అనౌన్స్ చేసి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. ఇదే తరుణంలో మహేష్ కెరీర్ లో అదిరిపోయే రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహేష్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ లకి హిట్లు ఉంటేనే….మహేష్ బాబు సినిమాలు చేస్తాడని...నాకు మహేష్ బాబు కంటే మహేష్ ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.
కాగా ఇప్పుడు త్రివిక్రమ్తో గొడవ తానే కావాలని పెట్టుకున్నట్టు అయ్యింది. త్రివిక్రమ్ సినిమాకు పోటీగా తన సినిమాను అదే రోజు కావాలని రిలీజ్ చేస్తుండడంతో త్రివిక్రమ్ సైతం మహేష్ తీరుపై అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ కు బర్త్ డే విసెష్ చెప్పి అదేరోజు పుట్టినరోజు జరుపుకున్న త్రివిక్రమ్కు విషెస్ చెప్పకపోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద డైరెక్టర్ల విషయంలో ఎప్పుడూ గొడవల కు పంతాలకు వెళ్లని మహేష్ తాజాగా వెరైటీగా ఈ ముగ్గురి డైరెక్టర్ల విషయంలో వెరైటీగా ప్రవర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో కామెంట్లు వినబడుతున్నాయి.