ప్రముఖ నటుడు
శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ
శరత్ కుమార్కు డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్గా
కోలీవుడ్ లో పేరు సంపాదించుకుంది. వరలక్ష్మీ నటనే కాదు మాటలు కూడా చాలా పవర్ఫుల్గా, బోల్డ్గా ఉంటాయి. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్గా పలు
తమిళ,
కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన వరలక్ష్మి తన మార్క్ పర్ఫార్మెన్స్ తో ప్రత్యేకతను చాటుకుంది. ఇక
సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న 'తెనాలి
రామకృష్ణ బీఏబీఎల్' సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు
రవితేజ సినిమాలో నటించడానికి అంగీకరించారని లేటేస్ట్ న్యూస్.
'డాన్శీను', 'బలుపు' వంటి సూపర్హిట్ సినిమాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ డైరెక్టర్
గోపీచంద్ మలినేని కాంబినేషన్లో హ్యాట్రిక్
మూవీ రూపొందనుందన్న సంగతి తెలిసిందే. లైట్
హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఠాగూర్ మధు ఈ
సినిమా నిర్మిస్తున్నారు. రవితేజ 66వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ రాజ పవర్ఫుల్
పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు గోపీచంద్ మలినేని కథను సిద్దం చేస్తున్నారు.
ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే తమిళ చిత్రాల్లో వైవిధ్య పాత్రలతో మెప్పిస్తున్న సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్కుమార్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. కథ, పాత్ర నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారని సమాచారం. ఒకవేళ ఇందులోనూ లేడీ విలన్ పాత్రే అయితే మాస్ మహారాజాతో వరలక్ష్మి పోటీపడి నటించడం ఖాయమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇక
రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. వి.ఐ.ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పాయల్
రాజ్ పుత్, నభా నటేష్ మాస్ మహారాజా సరసన
హీరోయిన్స్ గా నటిస్తున్నారు.