అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన మనం సినిమాలో ఒక చిన్న పాత్రతో టాలీవుడ్ కి నటిగా రంగప్రవేశం చేసిన రాశి ఖన్నా, ఆ సినిమాలో తన పాత్ర చిన్నదే అయినప్పటికీ తన అందం మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. 

అయితే అదే సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సుప్రీమ్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని తొలిసారి మంచి కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. మధ్యలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి ఆమెకు ఆశించిన రేంజ్ విజయాన్ని అయితే అందివ్వలేదు. ఇక ఆ తరువాత జైలవకుశ, తొలిప్రేమ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సరసన మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజు పండగే, అలానే వెంకటేష్ మరియు నాగచైతన్యల వెంకీ మామ సినిమాల్లో నటిస్తోంది. 

ఇక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత మరియి సినిమా సంగతులు ఫ్యాన్స్ తో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసుకునే ఈ భామ, నేడు బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రస్ లో ఒక ఫోటోషూట్ చేసి, వాటిని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేసింది. ఇక కాసేపటి క్రితం బయటికొచ్చిన ఈ ఫొటోస్ లో రాశి హొయలొలికించే అందాన్ని చూసి, ఆమె ఫ్యాన్స్  బ్లాక్ డ్రెస్ లో రాశి మా మతి పోగొడుతోంది అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: