సంక్రాంతి నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా తన సినిమాతో పాటు అల్లు అర్జున్ నటించిన 'అలా వైకుంఠపురం లో' సినిమా కూడా పోటీగా దిగుతున్న క్రమంలో ఆ సినిమాకి సంబంధించిన పాటలు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న నేపథ్యంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు విషయంలో మహేష్ బాబు కొత్త ఫార్ములా తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో మహేష్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని సినిమాలో నటించిన ప్రతి ఒక్కరితో ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినపడుతోంది.


ముఖ్యంగా ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామ్యంలో తన పాత్ర కూడా ఉండటంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు పోస్టర్లు ఇప్పటికే విడుదలయి మంచి రెస్పాన్స్ సంపాదించాయి. అంతేకాకుండా  మంచి సక్సెస్ మీద ఉన్న మహేష్ బాబు సినిమాని సక్సెస్ ట్రాక్ కలిగిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు కొద్దిరోజుల క్రితం భారీ ధరకు దక్కించుకోగా, ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల హక్కుల కోసం చాలామంది బయ్యర్లు పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ మార్కెట్ కలిగిన నైజాం హక్కులను ఓ బడా నిర్మాత దక్కించుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ కెరియర్లో సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. 



మరింత సమాచారం తెలుసుకోండి: