టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు కొద్దిరోజుల క్రితం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 2020 సంక్రాంతి కానుకగా జనవరి12న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇటీవల ఈ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే అంతకుముందే సరిగ్గా అదే రోజున తమ సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నట్లు అలవైకుంఠపురములో యూనిట్ కూడా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రెండు బడా సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతుండడంతో, అప్పటినుండి ఇదే మ్యాటర్ పలు టాలీవుడ్ వర్గాల తో పాటు ఆయా హీరోల మధ్య పలు చర్చలకు కేంద్రబిందువుగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ మరియు బన్నీలు ఇద్దరూ కూడా తమ సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేస్తే, ఆ ప్రభావం ఫస్ట్ రోజు వచ్చే ఓపెనింగ్స్ పై బాగా పడుతుందని మొదటినుండి పలువురు బయ్యర్లు మొత్తుకుంటున్నారు. 

అయితే ఇప్పటివరకు తమ రిలీజ్ డేట్స్ చేంజ్ చేసే విషయమై ఏ మాత్రం వెనక్కి తగ్గని రెండు సినిమాల నిర్మాతలు, ఎట్టకేలకు నేడు రాజీకి వచ్చి చర్చలు జరిపినట్లు సమాచారం. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఒకరు, మరికొందరు సినిమా ప్రముఖులతో కలిసి ఈ రాజీని కుదిర్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ రెండూ కూడా మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ అయినప్పటికీ, ఒకేరోజున వస్తే మాత్రం ఇద్దరికీ ఎంతో కొంత దెబ్బ ఉంటుందని భావించారట. అయితే మధ్యవర్తుల నిర్ణయం ప్రకారం రెండిడింటిలో ఒక సినిమా, ఒక రోజు ముందు కనుక రిలీజ్ అయితే బెటర్ అని మధ్యవర్తులు కోరారట. కాగా ఈ విషయమై కొంతసేపు ఆలోచించిన రెండు సినిమాల నిర్మాతలు అందుకు అంగీకరించడంతో, 

చివరకు సరిలేరు నీకెవ్వరు సినిమాని ఒకరోజు ముందుగా అంటే, జనవరి 11న రిలీజ్ చేయడానికి ఆ సినిమా నిర్మాతలు అంగీకరించినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ వార్త కాసేపటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ కూడా, దీనిపై ఒక అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం రెండు సినిమాలకు ఇది మంచి చేసే వార్త అని చెప్పకతప్పదు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: