లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తర్వాత తెలుగులో ఆ రేంజ్ కు వెళ్లిన హీరోయిన్ ఎవరంటే అది కచ్చితంగా అనుష్క అనే చెప్పాలి. అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ వచ్చిన అనుష్కను అరుంధతి సినిమాతో సెపరేట్ ఇమేజ్ వచ్చేలా చేశారు. ఆ తర్వాత తెలుగులో ఫీమేల్ లీడ్ సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది.


ఆ తర్వాత అనుష్క రుద్రమదేవి, బాహుబలి సినిమాలతో ఎక్కడికో వెళ్లింది. సినిమా కోసం ఎలాంటి పాత్రనైనా చేసే అనుష్క ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాలో నటిస్తుంది. కోలీవుడ్ హీరో మాధవన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కోనా ఫిల్మ్ కార్పొరేషన్ లో నిర్మిస్తున్నారు.


ఈ సినిమాకు గాను అనుష్క రెమ్యునరేషన్ అక్షరాల మూడున్నర కోట్లని తీసుకుందని సమాచారం. సినిమా కోసం రిస్క్ కు రెడీ కాని అందుకు తగినట్టుగా డిమాండ్ చేయడంలో మాత్రం వెనుకాడేది లేదు అని అనుష్కని చూస్తే అర్ధమవుతుంది. నిశ్శబ్ధం సినిమాలో అనుష్క డెఫ్ అండ్ డం రోల్ లో నటిస్తుంది.


ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడు ముందు ఉండే అనుష్క నిశ్శబ్ధం కోసం చాలా కష్టపడ్డదని తెలుస్తుంది. ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. డిసెంబర్ 20న క్రిస్ మస్ కానుకగా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. నిశ్శబ్దం సినిమాకు అనుష్కకు 3.5 కోట్లు ఇవ్వగా సినిమాలో హీరోగా నటించిన మాధవ్న్ కు 4.5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అనుష్క హీరోయిన్ గా కావాలంటే 3 కోట్ల పైన రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. నిశ్శబ్ధం తర్వాత ప్రస్తుతం అనుష్కసినిమా కమిట్ అవలేదు. ప్రభాస్ కొరటాల శివ కాంబోలో మళ్లీ ఆమెనే హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.  



మరింత సమాచారం తెలుసుకోండి: