ఈ మధ్య కాలాల్లో సినిమాల కన్నా ఫెమస్ అయినది టిక్ టాక్. సినిమా వాలు కూడా ఈ టిక్ టాక్ ద్వారా బాగా ఫెమస్ అవుతున్నారు . అయితే సరదా కోసం చేయాల్సిన ఈ విడిలో ఇప్పుడు కాస్త వైరల్ అవుతున్నాయి. కొంత మంది సినీ అవకాశాలు తీసుకుంటే .. మరికొందరు మాత్రం సెలెబ్రెటీలగా  ఫీలవుతుంటారు. అది కూడా జనాలను తనవైపు లాక్కోవడానికి కొత్తగా ట్రే చేస్తుంటారు కొంతమంది ప్రాణాలను కూగా పోగొట్టుకుంటారు. 


ఈ మధ్యకాలంలో ఖాళి సమయం దొరికితే చాలు టిక్ టాక్ లు చేస్తూ యువత సోషల్ మీడియాలో రచ్చ చేసున్న విషయం తరచూ చూస్తూనే ఉంటాము. కానీ, ఈ మధ్య ఈ టిక్ టాక్ ప్రేమ కు కేరాఫ్ అడ్డాగా మారిందట. టిక్ టాక్ లో పరిచయం కాస్త ప్రేమగా మారింది. దానితో ప్రియుళ్లను కలుసుకోవడానికి ఇంట్లో నుండి వెళ్లిపోయారు ఇద్దరు అక్కా చెల్లెల్లు. 


వివరాల్లోకి వెళితే .. తెలంగాణ సిద్దిపేటకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తరచూ టిక్ టాక్ లో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. వారిద్దరికీ అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్ మండలం పరిధిలోని డిగ్రీ చదివే వంశీ, స్వామిలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామని అనడంతో ఈ ఇద్దరు అక్క చెల్లెల్లు ఇంట్లో నుండి వచ్చేసారు. 


ఆ ఇద్దరు అబ్బాయిలను కలుసుకున్నారు. తీరా అక్కడకు వెళ్లి చుస్తే వంశి, స్వామిలు  పెళ్ళికి నో చెప్పడంతో అక్కాచెల్లెళ్లు కంగుతిన్నారు.  చివరకు పోలీసులను ఆశ్రయించారు. తల్లి దండ్రులు పిల్లలకు ఫోన్లు ఇచ్చి వారిని తప్పు ద్రోవ పట్టించకండి అంటూ పోలీసులు ఆదేశించారు.మరి ఈ విషయంపై ఆలు ఏంజరిగింది అనే విషయంపై  క్లారిటీ మాత్రం రాలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: