సంక్రాంతి వస్తుందంటే కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. ఇది మూడు రోజుల పండగ కానీ ముపై రోజుల ముందే మొదలవుతుంది. ఈ సమయంలో సిని అభిమానులకు సంక్రాంతితో పాటుగా సరి కొత్త సినిమాలు కూడ వినోదాన్ని పంచడానికి పోటీ పడతాయి. ఇక ఈ పోటిలో ఈ సారి మాత్రం ముఖ్యంగా రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి.


అవేంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ఒకే రోజున తమతమ చిత్రాలను విడుదల చేస్తున్నామని ఓ తేదీని కూడా ప్రకటించెయ్యడంతో ఆ రోజు ఎలా ఉండబోతుంది ఎవరి వల్ల ఎవరి చిత్రం ఓపెనింగ్స్ దెబ్బ తింటాయ్? ఇద్దరూ నష్టపోతారా? లాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పటి నుంచే ఇద్దరి అభిమానుల మెదళ్లను తొలిచి వేస్తున్నాయి.


ఈ విషయంలో ఎవరో ఒకరు త్యాగం చేయవలసిన పరిస్దితి ఇప్పుడు నెలకొంది. ఇకపోతే ఒకే రోజున విడుదల చేసినట్టయితే కేవలం ఒక్క సినిమాకు కాదు రెండు చిత్రాలకు కూడా ఓపెనింగ్స్ పోయే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంతే కాకుండా  లాంగ్ రన్ లో కూడా తప్పకుండా రెండు చిత్రాలకు నష్టాలు తప్పవని వెల్లడిస్తున్నారు.. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఈ ఇద్దరిలో మాత్రం ఎవరు విడుదల తేదీని మార్చుకున్నారో తెలవడం లేదు కానీ అల్లు అర్జున్ కంటే ముందే బాక్సాఫీస్ మీద మహేష్ యుద్ధం ప్రకటించినట్టు తెలుస్తుంది.


సో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న “అల వైకుంఠపురములో” కంటే ముందు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సినీవర్గాల వారు. ఇకపోతే ఈ రెండు సినిమాలకు  సంబంధించిన వార్తలు మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇక బన్నీకున్న మార్కెట్ ప్రకారం ఈ చిత్రాన్ని అటు మలయాళంలో కూడా విడుదల చేస్తున్నట్టుగా చిత్రబృందం తెలియజేసారు. ఇకపోతే  తెలుగులో ఇది వరకే డిజైన్ చేసిన పోస్టర్స్ నే ఇప్పుడు మలయాళ వెర్షన్స్ లో కూడా డిజైన్ చేసి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: