70 మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుని ఈ పాటను విడుదల చేసిన ఆదిత్యా మ్యూజిక్ సంస్థకు కోటిన్నర ఆదాయం తెచ్చి పెడుతున్న ‘సామజవరగమన’ మ్యానియాతో ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి రేసులో చాల ముందుగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ పాటకు చెక్ పెట్టె ప్రయత్నంగా ‘సరిలేరు నీక్వేవ్వారు’ మూవీకి సంబంధించి మొట్టమొదటి లిరికల్ వీడియో ఈ నెల 15న విడుదల చేయడానికి రంగం సిద్ధం అయింది. 

టోటల్ మెలోడీ సాంగ్ గా దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం కూడ కూరింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పాటను విన్న కొందరు ఇండస్ట్రీ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ పాటతో మహేష్ బన్నీకి గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సంక్రాంతి రాకుండానే డిసెంబర్ 15 నుండి మహేష్ బన్నీల వార్ కు ఈ పాటతో తెర లేవబోతోంది. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ బయ్యర్స్ అంతా ఈ పాట గురించి అంత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పాట ఏమేరకు యూత్ కు కనెక్ట్ అవుతుంది అన్న రిజల్ట్ బట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ ఏ రేంజ్ హిట్ గా మారబోతోంది అన్న అంచనాలకు రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ అనీల్ రావిపూడిలు ఈ వారం విడుదల కాబోతున్న ఈ పాట ట్యూన్ పై పూర్తి సంతృప్తి వ్యక్తపరిచిన తరువాత మాత్రమే ఈ పాటను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా మహేష్ మూవీ మొదటి పాట విడుదల కాకుండానే ‘సామజవరగమన’ కు సంబంధించి సరదాగా ప్రమోషన్ సాంగ్ మాదిరిగా ఫీమేల్ వెర్షన్ తయారుచేసి విడుదల చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడు అని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో మేల్ వాయిస్ తోనే ఈపాట ఉంటుంది. అయితే ఇదే పాట ఫిమేల్ వాయిస్ లో వుంటే ఎలా ఉంటుంది అన్న కొత్త ప్రయోగానికి తెర తీస్తూ ‘సామజవరగమన’ ఏమాత్రం తగ్గి పోకుండా ‘సరిలేరునీకేవ్వారు’ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు త్రివిక్రమ్..  


మరింత సమాచారం తెలుసుకోండి: