మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీనుకు టాలీవుడ్ లో మంచి డిమండే ఉంది. బాలకృష్ణ తన సినిమాలతో వరుసగా కామెడీ పండిస్తోన్న సమయంలో అసలైన బాలకృష్ణ సినిమా అంటే ఇది.. అని సింహతో నిరూపించాడు. తర్వాత లెజెండ్ తో మరో బ్లాక్ బస్టర్ ను బాలకృష్ణ ఖాతాలో వేశాడు. సరైనోడుతో అల్లు అర్జున్ 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. హిట్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్న బోయపాటికి బెల్లంకొండ సాయితో చేసిన జయ జానకీ నాయక, రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ బ్రేకులు వేసేశాయి.

 


దీంతో బోయపాటికి అవకాశం ఇవ్వాలంటే భయపడే పరిస్థితులు వచ్చేశాయి. హిట్ ఉంటేనే లైమ్ లైట్ లో ఉండే ఇండస్ట్రీలో బోయపాటికి మర్మం తెలిసొచ్చినట్టైంది. హిట్లతో తన రెమ్యునరేషన్ ను దాదాపు 15 కోట్లు తీసుకున్న బోయపాటి ప్రస్తుతం చేయబోయే సినిమాకి అందులో సగం తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. తన నెక్స్ట్ సినిమాను బాలకృష్ణతో చేయబోతున్న బోయపాటి మొదట్లో బడ్జెట్ భారీగా చెప్పాడని.. అందుకు బాలకృష్ణ ససేమిరా అన్నాడని  కూడా వార్తలు వచ్చాయి. సినిమా బడ్జెట్టే కాదు.. బోయపాటికి అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ తో పాటు భారీ క్యాస్టింగ్ ను తీసుకోవాలనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

 


మరి అంత క్యాస్టింగ్ అంటే రెమ్యునరేషన్లకే దాదాపు 50 కోట్లు అయిపోతాయి. ఇక తన మార్కు సినిమా అంటే మరో 75 కోట్లు వరకూ పెట్టాల్సందే. ప్రస్తుత పరిస్థితులు బోయపాటికి అర్ధమవడంతో తన రెమ్యునరేషన్ లో ఓ మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. వీలైనంత తక్కువ బడ్జెట్ లోనే సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాడని టాలీవుడ్ సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: