‘గీత గోవిందం’ లాంటి వంద కోట్ల సినిమాకు దర్శకత్యం వహించిన పరుశు రామ్ కష్టాలు ఎవరికి అర్ధం కాని విషయంగా మారాయి. తన తదుపరి సినిమా ఒక టాప్ హీరోతోనే చెయ్యాలి అన్న పట్టుదలతో పరుశు రామ్ మహేష్ చుట్టూ తిరిగి రెండు కథలు వినిపించినా మహేష్ మెప్పును పొందలేకపోయాడు. 

ఆతరువాత తన రూట్ మార్చుకుని ప్రభాస్ వైపు వెళ్ళి అతడి కోసం మరొక కథను చెప్పినా ప్రభాస్ కూడ పరుశు రామ్ వైపు ఆసక్తి కనపరచలేదు. దీనితో కనీసం నానీని అయినా మెప్పిద్దామని నాని గడప వద్దకు వెళ్ళి అతడికి ఒక రొమాంటిక్ కథను వినిపిస్తే నాని ఆ కథను విని ఆ కథ అంతా ‘గీత గోవిందం’ లా ఉంది అంటూ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో పరుశు రామ్ వద్ద ఒక్క అఖిల్ ప్రాజెక్ట్ తప్ప మరే మూవీ ప్రాజెక్ట్ లేదు అని అంటున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు అఖిల్ కు కూడ పరుశు రామ్ పై నమ్మకాలు సన్నగిల్లుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. దీనితో పరుశు రామ్ అఖిల్ ల ప్రాజెక్ట్ కూడ అటకెక్కినట్లే అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

ఇప్పటి వరకు పరుశు రామ్ కు బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తున్న అల్లు అరవింద్ కు కూడ జరుగుతున్న పరిణామాలు అర్ధంకాక ఏ హీరోతో పరుశు రామ్ మూవీని తన బ్యానర్ లో సెట్ చేయాలో తెలియక అరవింద్ కూడ తికమక పడుతున్నట్లు టాక్. పెద్ద హీరోలు దొరకక చిన్న హీరోలు నచ్చక పరుశు రామ్ పడుతున్న టార్చర్ ను చూసి హిట్ వచ్చినా పరుశు రామ్ అదృష్టం మారక పోవడం దురదృష్టం అంటూ కొందరు పరుశు రామ్ కు ఎదురౌతున్న పరిస్థుతుల పై ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: