తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ను `తలైవి` పేరుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ,
హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి చెన్నైలో ప్రారంభమైంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎంజీఆర్ లేకుండా జయలలిత బయోపిక్ను ఊహించలేం. అలాంటి లెజెండ్రీ తమిళనాడు దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు.
ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ వంటి
హాలీవుడ్ చిత్రాల్లో వర్క్ చేసిన ప్రముఖ
హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కంగనా రనౌత్ను జయలలితగా చూపిస్తున్నారు.
తాజాగా ఈ
సినిమా షూటింగ్ కార్యక్రమాలు
పూజా కార్యక్రమాలతో చైన్నైలో ఆదివారం ఉదయం ప్రారంభం అయినట్టు
బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్
ఆదర్శ్ ట్వీట్ చేసాడు. ఈ సినిమాలో ఎమ్జీఆర్ పాత్రలో అరవింద్ స్వామిగా నటిస్తున్నారు. ‘తలైవి’ చిత్రానికి
రాజమౌళి తండ్రి విజయేంద్ర
ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ
మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా తమిళం,తెలుగు,
హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో
ఎన్టీఆర్ పాత్రలో ప్రముఖ
టాలీవుడ్ అగ్ర నటుడు నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు శోభన్ బాబు పాత్ర కోసం మరో స్టార్ నటుడ్ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు నాలుగు బయోపిక్లు రెడీ అవుతున్నాయి. మరోపక్క ఈ బయోపిక్ కోసం కంగన పర్సనాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.