ఇప్పటి వరకు టాప్ హీరోల సినిమాలలో తల్లి తండ్రుల పాత్రలను ప్రకాష్ రాజ్ జయసుధ చేత నటింప చేస్తూ వచ్చేవారు. అయితే ఈసారి కాంబినేషన్ మార్చి రమ్యకృష్ణ తమిళ హీరో మాధవన్ లను కలిపి మెగా యంగ్ హీరోకు తల్లితండ్రులుగా మార్చే ప్రయోగం జరగబోతోంది. 

వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపధ్యంలో నటించబోతున్న లేటెస్ట్ మూవీ విషయంలో ఈ మూవీ ప్రాజెక్ట్ కు క్రేజ్ ఏర్పడటానికి ఈ మూవీ కథకు సంబంధించి వరుణ్ తేజ్ తల్లితండ్రులుగా రమ్యకృష్ణ మాధవన్ లను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కథ రీత్యా ఈ మూవీలో వీరిద్దరి పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

అయితే ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి ఈ మూవీ నిర్మాతలకు పారితోషిక విషయంలో రమ్యకృష్ణ మాధవన్ లు చుక్కలు చూపించినట్లు సమాచారం. ప్రస్తుతం వీరికి ఉన్న క్రేజ్ రీత్యా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు తల్లి తండ్రుల పాత్రలు పోషించిన ఏ నటీనటులకు ఇవ్వనంత క్రేజీ పారితోషికాన్ని వీరికి ఇస్తున్నట్లు టాక్.

ఈ క్రేజీ తల్లి తండ్రుల కాంబినేషన్ సక్సస్ అయితే కొంత కాలం గతంలో జయసుధ ప్రకాష్ రాజ్ లు హీరోల తల్లితండ్రులుగా కొనసాగించిన హవా ఇప్పుడు రమ్యకృష్ణ మాధవన్ లకు ట్రాన్సఫర్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. వయసు రీత్యా వీరిద్దరూ 50 సంవత్సరాల వయసు దాటిపోవడంతో ప్రస్తుత తరం యంగ్ హీరోలకు ఈ క్రేజీ తల్లి తండ్రులు మ్యానియా కొంత కాలం కొనసాగే ఆస్కారం ఉంది. ‘గద్దల కొండ గణేష్’ మూవీ తరువాత బాక్సర్ గా కనిపించడానికి వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్ళి శిక్షణ తీసుకోవడమే కాకుండా ఈ మూవీలో తన లుక్ ను డిఫరెంట్ గా చూపించడానికి చాల ప్రయత్నాలు చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: