వరసగా మూడు పరాజయాలు రావడంతో తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయిన అఖిల్ ఎన్నో ఆలోచనలు చేసి చిట్ట చివరకు బొమ్మరిల్లు
భాస్కర్ డైరెక్షన్ లో ఒక ఫ్యామిలీ
మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని
అల్లు అరవింద్ చాల జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే నిర్మాణం చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు అనుకోని విధంగా
నితిన్ ‘భీష్మ’
మూవీ సమస్యగా మారడం ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం అఖిల్
మూవీ కథ
నితిన్ ‘భీష్మ’ కథ ఒకటే అన్న ప్రచారం జరుగుతోంది.
హీరోయిన్ ప్రేమ గెలుచుకోవడం కోసం ఆమె ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడం అన్న పాయింట్ చుట్టూ ఈ రెండు
సినిమా కథలు అల్లబడినట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ కు సంబంధించి ‘బొమ్మరిల్లు’
భాస్కర్ సినిమాలో కాబోయే మామగారు అపార్థం చేసుకుంటే తిరిగి
హీరో ఎలా ప్రయోజకుడై ఎలా ఇంప్రెస్ చేసా అన్న పాయింట్ చుట్టూ అఖిల్
మూవీ కథ ఉంటుంది అని అంటున్నారు.
ఇదే కథను కొద్ది మార్పులతో
వెంకీ కుడుముల
నితిన్ తో తీస్తున్న ‘భీష్మ’ లో కూడ కనిపిస్తుంది అని అంటున్నారు. ఈ మూవీలో
హీరో పనీపాట లేకుండా తిరుగుతూ ఉంటే
హీరోయిన్ తండ్రి మెప్పును పొందడానికి కంపెనీ పెట్టి ప్రయోజకుడై
హీరోయిన్ ను ఆమె ఫ్యామిలీని
హీరో ఎలా ఇంప్రెస్ చేసాడు అన్న పాయింట్ చుట్టూ ఈ
మూవీ కథ త్రిరుగుతుంది అని అంటున్నారు. దీనితో ఈ రెండు సినిమాలలో ఏ
సినిమా ముందుగా విడుదల అయితే ఆ మూవీకి ఎడ్జి ఉంటుంది కానీ ఆ తరువాత విడుదలైన రెండవ సినిమాకు కష్టాలు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్న
నితిన్ కు అఖిల్ కు ఇద్దరికీ హిట్స్ కావాలి ఇలాంటి పరిస్థితులలో వీరి సినిమాలు ఒకే కథను పోలి ఉండటం అఖిల్ కు షాకింగ్ గా మారింది..