టెలివిజన్ రంగంలో యాంకర్‌గా రాణిస్తూ తనకంటూ సెపరేట్ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యాంకర్ అనసూయ...టెలివిజన్ ప్రేక్షకుల మనసులను గెలుచుకొని సక్సెస్ ని తన కేరాఫ్ అడ్రస్ గా మార్చుకొని సినిమా ఇండస్ట్రీలో కుర్ర నటుడు అడవి శేష్ నటించిన క్షణం సినిమా తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా తో అదిరిపోయే హిట్ అందుకుంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మ పాత్రలో అనసూయ నటించిన నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా ఇండస్ట్రీ నుండి అనేకమంది సీనియర్ నటీనటుల ద్వారా అభినందనలు వెల్లువెత్తాయి. ఇటువంటి తరుణంలో రంగస్థలం సినిమా తర్వాత ఆమె ప్రధానపాత్ర లో నటించిన ‘కథనం’ సినిమా ఇటీవల విడుదలై దారుణంగా ఫ్లాప్ అయ్యింది.


ఇదే క్రమంలో హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' అనే మూవీలో నటించడం జరిగింది ఆ సినిమా ఇటీవల విడుదల అయి బాక్సాఫీసు దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఈ సినిమా కూడా అనసూయకు ఏమాత్రం కలిసిరాలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా స్థిరపడాలని భవిష్యత్తులో చేయబోయే పాత్రల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటోంది. అందుకోసం ఆమె ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవటం లేదట. అయితే ఇన్ని ప్లాఫ్ లు వచ్చినా అనసూయకు  ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.


వాటిలో సుకుమార్ నుంచి ఓ బంపర్ ఆఫర్ అందుకుందని వినికిడి. త్వరలో అల్లు అర్జున్ తో సుకుమార్ మూవీ మొదలు కాబోతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సినిమాలో అనసూయకు ఒక మంచి రోల్ రంగమ్మత్త పాత్ర టైపు లోనే సుకుమార్ కేటాయించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. దీంతో ఈ సినిమాతో మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సక్సెస్ ట్రాక్ లోకి మళ్ళీ ఎక్కడానికి అనసూయ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: