దాదాపు వంద రోజులకు పైగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాల్టీ షో నవంబర్ మూడవ తారీఖున జరిగిన ఎపిసోడ్ తో ముగిసింది. ఈ సీజన్ కి టైటిల్ రాహుల్ ని వరించింది.  చివరిగా ఓటింగ్లో శ్రీముఖి మరియు రాహుల్ పోటా పోటీ పడటం తో...బిగ్ బాస్ ప్రేక్షకులు మరియు అభిమానులు రాహుల్ ని గెలిపించారు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే వేదికపై మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున చేతులమీదుగా ట్రోఫీని అందుకున్నాడు రాహుల్. ఇదిలా ఉండగా షో ముగిసిన నేపథ్యంలో హౌస్ ఎంట్రీ ఇచ్చిన సభ్యులు ప్రస్తుతం సోషల్ మీడియా ఎవరు ఎక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వంటి వీడియోస్ ని పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.


ప్రస్తుతం ట్రోఫీలను రాహుల్ అయితే పార్టీల మీద పార్టీలు చేసుకుంటూ పబ్బుల్లో డాన్సులు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక శ్రీముఖి అయితే దాదాపు హౌస్లో 105 రోజులు ఉండటంతో రన్నర్ గా వచ్చిన తనకి సంతోషం అని ఎంతో మంది హృదయాలను గెలిచిన ఆనందం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్రస్తుతం రిలాక్స్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఫ్రెండ్స్,  ఫన్ తో ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలోని పాటలతో స్టెప్స్ వేసి ఓ వీడియో వదిలింది. శ్రీముఖి ఫుల్ ఎనర్జీగా ఉంది. ఈ వీడియో ఆమె ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. శ్రీముఖి మాట్లాడుతూ... విశ్రాంతి కోసం మాల్దీవుల్లో. కొన్నిరోజులు కుటుంబంతో గడుపుతా. తరువాత ఎప్పటిలానే షోలు కొనసాగిస్తా. బిగ్‌బాస్‌ వల్ల నాలో కోపం చాలావరకూ తగ్గింది. ఓపిక పెరిగింది. ఛాలెంజ్ లను తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం బలపడ్డాయి అంటూ ఇంకా అనేక విషయాల గురించి చెప్పుకొచ్చింది.


ఇంకా అలీ రెజా మరియు శివ జ్యోతి అలాగే పునర్నవి, హేమ ఇంకా చాలామంది ఇంటి సభ్యులు బయట పార్టీలు చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇక జంటగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుణ్ వితిక లు అయితే అవుట్ డోర్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక టీవీ9 మాజీ యాంకర్ జాఫర్ అయితే పలు న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ రాణిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: