త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురం లో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ లో సినిమా యూనిట్ చాలా బిజీ బిజీగా ప్యారిస్ దేశంలో గడుపుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన విడుదల చేసిన పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. సామజవరగమన, రాములో రాముల పాటలు అదరగొడుతున్నయి. ముఖ్యంగా సామజ వర గమన సాంగ్ అయితే సౌత్ ఇండియాలో ఏ సినిమా పాటకి దక్కని ఆదరణ యూట్యూబ్ లో దక్కించుకుంది.


దీంతో సామజవరగమన సాంగ్ కోసం స్పెషల్ గా మరికొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని నిర్మాత డిసైడ్ అయినట్లు...ఇందుకోసం ప్యారిస్లో అందమైన ప్రదేశాలలో ఈ సాంగు చిత్రీకరణ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా మూడవ సినిమా అయిన నేపథ్యంలోకచ్చితంగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని అల్లు అర్జున్- త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో...ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఇవే అని చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వారు అంటున్నారు.


ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ స్టోరీ అని మరియు అదే విధంగా అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే ల మధ్య వచ్చేరొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని పూజా హెగ్డే సాఫ్ట్వేర్ కంపెనీ కి ఓనర్ గా మరియు ఆ కంపెనీలో ఎంప్లాయి గా అల్లు అర్జున్ నటిస్తున్నాడని...అల్లు అర్జున్ ని పూజా హెగ్డే ఏడిపించే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి అంటూ కామెంట్లు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ కూడా అదిరిపోయే రీతిలో వచ్చిందని ఇక మామూలుగానే స్టెప్పులు ఇరగదీసే అల్లు అర్జున్ సినిమా కోసం మరింతగా కష్టపడ్డారు అంటూ ఇండస్ట్రీలో అలా వైకుంఠపురం లో సినిమా ప్లస్ పాయింట్స్ ఇవే అన్న వార్త వినబడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: