మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం 'అల వైకుంఠపురం లో...' సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ కాగా ప్రత్యేకంగా 'సామజవరగమన' సాంగ్ కోసం విదేశాల్లోని ఐకానిక్ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుతున్నారు చిత్రబృందం. అయితే త్రివిక్రమ్ కథల్లో ఎంత వైవిధ్యం ఉంటుందో మనందరికీ తెలిసిందే. అల వైకుంఠ పురం లో సినిమా ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తున్న బన్నీ ఫ్యాన్స్ అందరి కోసం ఆ సినిమా కథ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 

ఇంతకీ కథ ఏమిటంటే జయరామ్ మరియు మురళీశర్మ ప్రాణ స్నేహితులు కాగా వారిలో జయరాం కోటీశ్వరుడు కానీ మురళీశర్మ కార్ డ్రైవర్. జయరామ్ మరియు టబు లకు అల్లు అర్జున్ పుడతాడు. మురళి శర్మకు సుశాంత్ పుడతాడు. అయితే వారిద్దరూ పుట్టిన సమయంలోనే  సరిగ్గా జయరామ్ మరియు మురళీశర్మ ఒక ఆసక్తికరమైన డిస్కషన్ చేస్తుంటారు. మురళి శర్మ కోటేశ్వరుడి కొడుకు మళ్లీ కోటీశ్వరుడు అవుతాడు అలాగే కార్ డ్రైవర్ కొడుకు ఇంచుమించు అదే స్థాయిలో ఉంటాడు అని అనగా జయరాం మాత్రం అలా ఏమీ కాదు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు ఎదుగుతారు అని అంటాడు.

ఈ ప్రాణ స్నేహితులు ఇద్దరి మధ్య వాదన కొద్దిగా పెద్దదయి ఇద్దరూ తమ కొడుకులను ఎక్స్చేంజ్ చేసుకునే వరకు వస్తుందట. అయితే ఈ విషయం వారి భార్యలకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. తాము ఉండవలసిన ఇంట్లో కాకుండా మరొక ఇంట్లో పెరిగిన ఇద్దరూ చివరికి ఎలా తయారవుతారు... మధ్యలో విలన్ నవదీప్ పాత్ర ఇందులో ఏమిటి? ఇకపోతే చివర్లో సుశాంత్ తన అసలు స్థానానికి వెళ్లడానికి ఇష్టపడతాడా ఒకవేళ్ అతను ఒప్పుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అన్నది మిగిలిన కథ.

ఇవన్నీ ఒట్టి కల్పితాలు, ఊహాగానాలు అనుకుందాం అంటే కథ మొత్తం లో త్రివిక్రమ్ ఫ్లేవర్ ఉండటంతో ఇదే ఫైనల్ కదా అని అందరూ అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: