బిగ్ బాస్ తెలుగు సీజన్ 3.. షో ఉన్న 106 రోజులు రోజులు సోషల్ మీడియాలో ఎంత హల్ చల్ చేసింది అనేది అందరికి తెలిసిందే. షో ప్రారంభం నుండి తాబేలులా టాస్కులు పర్ఫర్మ్ చేసిన
రాహుల్ చివరికి విజయం సాధించాడు.
శ్రీముఖి అనుకోని రీతిలో రన్నర్ అయ్యింది. రన్నర్ అయినా
శ్రీముఖి మాల్దీవ్స్ రెస్ట్ తీసుకోగా
విన్నర్ అయినా
రాహుల్ అన్ని
టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ హల్ చల్ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ
టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన
రాహుల్ సంచలన విషయాలు వెల్లడించాడు.
బిగ్ బాస్ కి వెళ్లినందుకు అతనికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే
బిగ్ బాస్ కి వెళ్లడం వల్ల
రాహుల్ సిప్లిగంజ్ ఓ గొప్ప ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడట. ఆ గొప్ప ఛాన్స్ ఏంటి అని అనుకుంటున్నారా ?
అదేనండి..
అల్లు అర్జున్ కథానాయకుడుగా
పూజా హెగ్డే కధానాయికగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో చిత్రంలో పాట పడే ఛాన్స్ మిస్ చేసుకున్నాడట. అయితే ఈ
సినిమా నుండి తాజాగా విడుదలైన రెండు పాటలు సామజవరగమనా, రాములో రాముల పాటలు ఎంత హల్ చల్ చేస్తున్నాయో అందరికి తెలిసిందే.
అయితే ఈ రెండు హిట్ పాటల్లో ఒక పాట
రాహుల్ సిప్లిగంజ్ పడాల్సిన పాటట.
సంగీత దర్శకుడు థమన్ రాములో రాముల పాటను
రాహుల్ తో పాడించాలి అనుకున్నాడట.. కానీ
రాహుల్ బిగ్ బాస్ లో ఉండటం వల్ల అది కుదరలేదట. అయితే
బిగ్ బాస్ బృందంతో థమన్ బృందం అప్పటికి మాట్లాడి విశ్వా ప్రయత్నాలు చేశారట.. కానీ కుదరలేదట.
ఈ విషయాన్నీ స్వయంగా
రాహుల్ ఏ ఓ
టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ విషయాన్నీ
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన
రాహుల్ కు తన స్నేహితుడైన నోయల్ ఏ చెప్పాడట. ఏమైనప్పటికి.. ఆ పాట
రాహుల్ పాడకపోయినా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఇంటర్వ్యూ చుసిన
రాహుల్ ఫ్యాన్స్ పాట పడే అవకాశం మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్నారట.