మెగా హీరోగా అల్లు వారబ్బాయి గా అల్లు అర్జున్ టాలీవుడ్ కి ఏంట్రీ ఇచ్చారు అల్లుఅర్జున్. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటి సినిమానే మంచి విజయం సొంతం చేసుకోవడంతో కెరియర్ కు  మంచి పడ్డాయి.  తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ స్టైల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సినిమాలో న్యూ లుక్ తో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తుంటారు. ఇక సినిమాలలో అల్లుఅర్జున్ స్టైల్ ని  స యువత ఎక్కువగా  ఫాలో అవుతుంటారు. ఇక అల్లు అర్జున్ డాన్స్ లో కూడా స్టైల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది..



 ఇదిలా ఉండగా అల్లుఅర్జున్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకున్నప్పటికీ అవి ప్రేక్షకాదరణ మాత్రం పొందలేకపోయాయి . దీంతో అయోమయంలో పడిన అల్లు అర్జున్ సినిమాలకు కాస్త గ్యాప్ కూడా తీసుకున్నాడు. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు అల్లు అర్జున్. దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల వైకుంఠపురము లో అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటికే జులాయి,  సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాలో వచ్చి  బాక్సాఫీస్ ని షేక్ చేసి  భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఓ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో మరో భారీ హిట్ ఖాయమని అందరూ భావిస్తున్నారు.



 ఇక త్రివిక్రమ్ సినిమా అంటే మాటలతో మాయ చేయడం... పంచు డైలాగ్ లతో మైమరిపించడం  ఉంటుంది కాబట్టి సగటు ప్రేక్షకుడికి  సినిమాలో ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. కాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కి  కూడా భారీ  రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సామజవరగమన రాములో  రాములు అనే పాటలు  కూడా యూట్యూబ్ ని ఒక రేంజ్ లో షేక్ చేసాయి. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే,  నివేదా పేతురాజ్ నటిస్తున్నారు.  అలా వైకుంఠపురం లో సినిమాకి తమన్ స్వరాలు అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: