రాజమౌళి కొరరటాల శివల తరువాత ఇండస్ట్రీలో వరస హిట్స్ అందుకున్న రికార్డ్ ఒక్క దర్శకుడు అనీల్ రావిపూడికి మాత్రమే సొంతం. అలాంటి ఈ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ అనుకున్న సమయంలో ఎటువంటి బ్రేకులు లేకుండా నిర్మాణం పూర్తి చేసుకుంటూ కేవలం ఆరు నెలల సమయంలోపే ఈమూవీ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చేనెల మూడవ వారానికి ఈమూవీ ఫస్ట్ కాపీ రెడీ అవ్వబోతు ఉండటం ఇండస్ట్రీలోని చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఈమూవీలో అనేకమంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అయితే ఈమూవీలోని కీలక పాత్రలో ఇండస్ట్రీలో ఇగో చిరునామాగా ఉండే ప్రకాష్ రాజ్ రాజేంద్రప్రసాద్ విజయశాంతి వీరందరూ కలిసి నటించడం ఒక హాట్ టాపిక్ అయితే యాటిట్యూడ్ చాల ఎక్కువగా ఉన్న ఈ ముగ్గురునీ అనీల్ రావిపూడి ఎలా హ్యాండిల్ చేసాడు అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు. 

అంతేకాదు ఇలాంటి ఈముగ్గురు సీనియర్ నటులనీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకు వచ్చే సీన్స్ లో ఎవర్ని హర్ట్ చేయకుండా అనీల్ రావిపూడి అతి చాకచక్యంగా ఈసీన్స్ ను మరో రీ టేక్ అన్నది లేకుండా తీసిన పద్ధతి గురించి వస్తున్న వార్తలు విన్న సీనియర్ దర్శకులు కూడ ఆశ్చర్యపోతున్నారు. ప్రకాష్ రాజ్ విజయశాంతి లకు ఒక సీన్ మళ్ళీ రీ టేక్ అంటే చాల అసహనానికి లోనవుతారు అన్న వార్తలు ఉన్నాయి. 

అదేవిధంగా షూటింగ్ స్పాట్ కు అందరికంటే ముందుగా వచ్చే రాజేంద్రప్రసాద్ ను ఒక్క క్షణం ఖాళీగా కూర్చోపెట్టినా అతడు విపరీతమైన అసహనానికి లోనవుతాడు. ఇక మరొక నటుడు మురళీ శర్మ షూటింగ్ స్పాట్ లో రకరకాల సెటైర్లు వేస్తుంటాడు అన్న ప్రచారం ఉంది అలాంటి మురళీ శర్మ ఒక్క జోక్ కూడ వేయకుండా తన పని తాను చాల మౌనంగా చేసుకుని వెళ్ళి పోవడం ఈ మూవీ షూటింగ్ లోని వివరాలను చాల దగ్గర నుండి పరిశీలించిన వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దీనితో యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడికి సమర్ధతతో పాటు విపరీతమైన మంచితనం సహనం కూడ ఉంది అంటూ ఇండస్ట్రీలో అనీల్ రావిపూడి మేనేజ్మెంట్ స్కిల్స్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: