మహేష్ బన్నీల వ్యక్తిగత ప్రతిష్టకు వారి కలక్షన్ స్టామినాకు రాబోయే సంక్రాంతి వార్ వేదికగా మారడంతో ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు ఈ సినిమాలకు సంబంధించి తీసుకుంటున్నారు. ఈ రెండు భారీ సినిమాల బడ్జెట్ కూడ బాగా పెరిగిపోవడంతో ఈ మూవీలను చాల హెచ్చు రేట్లకు మార్కెట్ చేస్తున్నారు. 

ఈ మధ్య కాలంలో విడుదలైన ‘సాహో’ ‘సైరా’ మూవీ బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చిన నేపధ్యంలో సంక్రాంతి రేసుకు రాబోతున్న మహేష్ అల్లు అర్జున్ సినిమాలకు కొన్ని ఏరియాలలో మార్కెట్ పరంగా ఎదురీత ఎదురౌతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మార్కెట్ ను నిలబెట్టడానికి అనీల్ రావిపూడి ఒక కొత్త వ్యూహాన్ని రచించాడు ని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా టాప్ హీరోలకు సంబంధించిన సినిమాలలో ఒక ఐటమ్ సాంగ్ ను మాత్రమే పెడతారు. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో రెండు ఐటమ్ సాంగ్స్ ఉంటాయని ఈ మూవీ నిర్మాతలు బయ్యర్లకు లీకులు ఇస్తున్నట్లు టాక్. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఈ రెండు ఐటమ్ సాంగ్స్ కు మసాల టచ్ తో ఉండే ట్యూన్స్ ను కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.

ఈ రెండు ఐటమ్ సాంగ్స్ లో ఒక సాంగ్ లో తమన్నా మరొక సాంగ్ లో పూజ హెగ్డే మహేష్ తో చిందులు వేస్తారని తెలుస్తోంది. ఒకవైపు దేశ భక్తి మరొక వైపు ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు విపరీతంగా నవ్వించే కామెడీ ట్రాక్ తో పాటు మాస్ ప్రేక్షకుల కోసం రెండు స్పెషల్ సాంగ్స్ ఇలా ఒకే సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించుకునే విధంగా ‘సరిలేరు నీకెవ్వరు’ ఒక సరికొత్త ప్రయోగానికి తెర తీయబోతోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: