టాలీవుడ్ మెగా హీరో అల్లు అర్జున్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తెరపై కనిపిస్తున్నారు.  నా పేరు సూర్య మూవీ తర్వాత మరో సినిమాలో నటించడానికి ఈసారి చాలా సమయం తీసుకున్నారు. గతంలో ఈ విషయంపై ఎన్నో సార్లు అభిమానుల నుంచి  ప్రశ్నలు వచ్చినపుడల్లా త్వరలో మంచి న్యూస్ చెబుతానని అసలు విషయం దాటేస్తూ వచ్చారు అల్లు అర్జున్.  దానికి కారణం నా పేరు సూర్య అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో తాను తర్వాత నటించే మూవి సూపర్ హిట్ కావాలని మంచి కథల కోసం ఎదురు చూసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. 


ప్రస్తుతం తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తున్నాడు బన్ని.  ఈ మూవీ సన్నాఫ్ సత్యమూర్తి లా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందని అంటున్నారు.  ఇక ఈ మూవీలో సాంగ్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని ఇప్పటికే తెలిసిపోతుంది.  సామజవర గమనా, రాములో రాములా అంటూ యూట్యూబ్ లో సంచలన రికార్డులు నమోదు అవుతున్నాయి.  అంతే కాదు ఈ మూవీలో చాలా కాలం తర్వాత అలనాటి అందాల భామ టబు నటిస్తుంది. 


ఇక అల్లు అర్జున్ సరసన జువ్వాడ జగన్నాథం తర్వాత అందాల భామ పూజా హెగ్డే నటిస్తుంది.  ఈ మద్య పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా విజయం అవుతున్న విషయం తెలిసిందే.  మరి ఈ సెంటిమెంట్ బన్నికి బాగా వర్క్ ఔట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఆ మద్య టీజర్ లో ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అని మురళీ శర్మ అడగగా..సీరియస్ గా ఇవ్వలా..వచ్చింది అని బన్ని కొట్టే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  నిజంగానే బన్నీ గ్యాప్ ఇవ్వలా..అలా వచ్చేసింది అన్నట్లు చెప్పకనే చెబుతున్నాడు.  మంచి కథ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన బన్నికి ‘అలా వైకుంఠపురములో’ అన్ని కలిసి వచ్చేలా ఉన్నాయి.  మరి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా చూడలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: