రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం పవన్ రాజకీయాలతో బిజీ అయిపోయారు.
జనసేన పార్టీ
2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చెయ్యడం, ప్రచారంలో పాల్గొనడం సహా అన్నీ తానై పార్టీ ని ముందు ఉండి నడిపించారు పవన్. అయితే
పవన్ మాత్రం పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో పరాజయం చవిచూశారు.
‘మీరు కథలు సిద్ధం చేసుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలెడదాం’ అంటూ దర్శక నిర్మాతలకు ఓ హింట్ ఇచ్చారట పవన్.
పవన్ హింట్ ప్రకారం
2020 జనవరి తరువాత 'పింక్'
రీమేక్ షూటింగ్ పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. వాటికీ వ్యూహ రచన చేయాల్సివుంది. ఇంత కీలమైన సమయంలో
సినిమా మొదలెడితే ఫలితాలు తేడాగా వచ్చే ప్రమాదం ఉందని పవన్ భావిస్తున్నారు. అందుకే... ఇప్పుడప్పుడే సినిమాలవైపు రాకూడదని ఆయన అనుకుంటున్నారట.
పవన్ చివరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన
అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు. ఈ
సినిమా డిజాస్టర్ కావటంతో అభిమానులు నిరాశచెందారు. ఒకవేళ పవన్ సినిమాకలు గుడ్ బై చెపితే ఓ బ్లాక్ బస్టర్
సినిమా చేసిన తరువాత సినిమాల నుంచి రిటైర్ అవ్వాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు పవన్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ కావటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్
పండుగ చేసుకుంటున్నారు.