కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అల్లు వారబ్బాయి అల్లు అర్జున్. ఆ తర్వాత అంతకు ముందే బాలనటుడిగా విజేత, స్వాతిముత్యం సినిమాలో నటించాడు. ఆతర్వాత వచ్చిన ఆర్య, బన్ని, హ్యపీ సినిమాలతో హ్యాపీగా తన జర్నీని కొనసాగిస్తున్నాడు. మధ్య మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరచిన మరికొన్ని సినిమాలు బ్లాక్బస్టర్ గా నిలిచాయి.
ఇకపోతే త్రివిక్రం కాంబినేషన్లో ఇదివరకే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబినేషన్ చాలా కలిసివచ్చినట్లుగా ఉంది. అందుకే ముచ్చటగా మూడో సారి హిట్ కొట్టి హ్యట్రిక్ సాధించడానికి అల వైకుంఠపురములో చిత్రముతో మనముందుకు వస్తున్నాడు అల్లు అర్జున్.. ఇక తన 19న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో అర్జున్కు జోడిగా పూజా హేగ్దే నటిస్తుండగా. కీలక పాత్రలో హీరో సుశాంత్ కనిపించనున్నాడు.
అంతే కాకుండా నవదీప్, రావు రమేష్ , మురళీ శర్మ ముఖ్యపాత్రలో కనిపిస్తుండగా. అలనాటి తార టబు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం కాబట్టి సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకంటే ముందు అల్లు అర్జున్ చేసిన రెండు సినిమాలు నా పేరు సూర్య డిజాస్టర్.. దానికి ముందు డిజే కూడా యావరేజ్ గా ఆడాయి..
దీంతో ఇప్పటికే హిట్ ఫేర్ గావున్న వీరి కాంబినేషన్లో మరో హిట్ గ్యారంటీగా వస్తుందనే నమ్మకంతో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇకపోతే 2014లో అల్లు అర్జున్ ఓ లఘు చిత్రన్ని నిర్మించాడు ఆ చిత్రం పేరు ‘ఐ యామ్ దట్ ఛేంజ్.. ఈ లఘు చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా అల్లు అర్జున్ కూడా ఇందులో నటించాడు.