నందమూరి బాలకృష్ణ గత ఏడాది కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించిన  జైసింహా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు
సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలయమయి, పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే ఆ తరువాత కొంత ఆలోచనలో పడ్డ బాలకృష్ణ, మరొక్కసారి జైసింహా దర్శకుడు కేఎస్ వారికుమార్ తోనే మరొక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. 

ఇక ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రూలర్. బాలకృష్ణ, ధర్మ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలో ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తీస్తుందట సినిమా యూనిట్. దాదాపుగా 500 మంది ఫైటర్స్ తో కలిసి బాలకృష్ణ పాల్గొనే ఈ పోరాట సీన్, మొత్తం సినిమాకే పెద్ద హైలైట్ అని, ఇక రేపు సినిమా రిలీజ్ తరువాత నందమూరి ఫ్యాన్స్ కు ఈ సీన్ కన్నుల పండుగగా నిలవడం ఖాయం అని సమాచారం. 

బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ భూమిక ఒక స్పెషల్ రోల్ లో నటిస్తోంది. సికె ఎంటర్టైన్మెంట్స్  సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా సి రామ్ ప్రసాద్ పని చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా సాంగ్స్ మరియు టీజర్ రిలీజ్ కాబోతుండగా, సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: