స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా 'అల వైకుంఠపురము లో'.2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా లో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా పూజ ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పి షాకిచ్చింది. 

సినిమా లో పూజ.. బన్నీ ఒకే ఆఫీసులో పని చేస్తారట. తను బన్నీ కి బాస్ గా ఈ సినిమా లో నటిస్తున్నానని తెలిపింది. చాలా స్ట్రిక్ట్ బాసుగా ఉన్నప్పటి కీ అప్పుడప్పుడూ సాఫ్ట్ గా ఉంటుందట. అంతే కాదు గోల్స్ విషయంలో చాలా టఫ్ గా ఉంటుందట. మరి ఇలాంటి అందమైన స్ట్రిక్ట్ బాసు తో మన స్టైలిష్ స్టార్ ఎలా వేగుతాడో వేచి చూడాలి అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. అయితే వర్క్ విషయం ఎలా ఉన్నా తమ మధ్య సంభాషణలు ఫన్నీగా ఉంటాయని.. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని పూజా చెప్పింది.

ప్రస్తుతం 'అల వైకుంఠపురము లో' టీమ్ యూరోప్ షెడ్యూల్ లో భాగంగా ప్యారిస్ లో ఉన్నారు. ఇప్పటి కే చార్ట్ బస్టర్ గా నిలిచిన సామజ వరగమన పాటను ప్యారిస్ లోని అందమైన లోకేషన్ల లో చిత్రీకరిస్తున్నారట. ఈ పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా అక్కడే జరుపుతున్నారని తాజా సమాచారం. ఇక గత కొన్ని రోజులుగ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. మరి ఈ అంచనాలను 'అల వైకుంఠపురము లో' అందుకుంటుందో లేదో చూడాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ మధ్య కొన్ని భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్స్ సాంగ్ టీజర్స్ తో ప్రేక్షకుల్లో భారీగా అంచానలను పెంచేసి పెద్ద డిజాస్టర్స్ గా మిగిలిన సంగతి తెలిసిందే. అందుకు ఉదాహరణ కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు-2 అని చెప్పక తప్పదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: