దేవిశ్రీ ప్రసాద్ 2000 సంవత్సరంలో దేవి
సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పటికి రెండు దశాబ్దాలు అవుతోంది. దేవీ మార్క్ ఎక్కడా చెక్కుచెదరలేదు. టాప్ స్టార్స్ అంతా దేవీయే కావాలని కోరుకుంటున్నారు. దేవీ అంటే యూత్
హార్ట్ అని , వారి పల్స్ పట్టుకునే రిథం అతడని పెద్ద పేరు. దానికి తగినట్లుగా దేవీ కెరీర్లో
బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో ఉన్నాయి.
అయితే ఇటీవల దేవీకి కాలం కలసిరావడంలేదనే చెప్పాలి. ఒకప్పుడు దేవీ మ్యూజిక్ ఆల్బం అంటే మొత్తానికి మొత్తం హిట్ సాంగ్స్ ఉండేవి. ఇపుడు ఒకటి రెండుతో సరిపెట్టేస్తున్నాడని టాక్ వచ్చేసింది. ఇక దేవీశ్రీకి పోటీగా
తమన్ రెడీగా ఉన్నాడు.
డైరెక్టర్ కొరటాల తీసినవి తక్కువ సినిమాలు అయినా ఎపుడూ దేవీశ్రీని పెట్టుకునేవారు. ఆయన సైతం చిరంజీవితో తీసే కొత్త మూవీకి దేవీని పక్కనపెట్టాడని టాక్.
ఇక త్రివిక్రం
శ్రీనివాస్ ఎపుడో దేవీని సైడ్ చేశాడని అంటారు. దీంతో ఇపుడు దేవీ టఫ్ ఫైట్ ని ఇండస్ట్రీలో ఫేస్ చేస్తున్నాడు. దేవీశ్రీ సంక్రాంతిని పెద్ద పోటీని ఎదుర్కొంటున్నాడు.
తమన్ ట్యూన్స్ తో దేవీశ్రీ ట్యూన్స్ కి పోటీ వస్తోంది. అల వైకుంఠపురంలో సినిమాకు
తమన్ అందించిన బాణీలు కిర్రెక్కించేస్తుననయి. సామాజవరగమనా సాంగ్ అయితే 7.7 లక్షల వ్యూస్ తో టాప్ రేంజిలో ఉంది. ఇక రాములా రాములా సాంగ్ అయితే అదరగొడుతోంది.
అదే సమయంలో పోటీగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు
మూవీ ట్యూన్స్ ఇంకా రాలేదు. దేవీశ్రీకి ఇపుడు అతి పెద్ద పోటీ రెడీ చేసి పెట్టాడు తమన్. దాంతో ఆ వత్తిడిని తట్టుకుని భారీ వ్యూస్ ని దేవీశ్రీ టార్గెట్ చేశాడని అంటున్నారు. మరి దానికి తగినట్లుగా దేవీ కొత్త సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. అదే జరిగితే దేవీశ్రీ మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చినట్లు అంటున్నారు. మొత్తానికి
అల్లు అర్జున్ మూవీ కాదు కానీ దేవీకి టెర్రరెక్కిపోతోందిట.