బాహుబలి చిత్రంతో నాయకుడుగానే కాకుండా ప్రతినాయకుడుగా కూడా మంచి పేరు తెచ్చుకున్న
హీరో దగ్గుపాటి రానా. ఫిదా చిత్రంతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన క్రేజీ
భామ సాయిపల్లవి మరి వీరిద్దరి కాంబినేషన్ లో విరాటపర్వం అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వేణు ఊడిగల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 1990నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కథను రాసుకున్నారు దర్శకుడు. ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాలో
రానా పోలీస్ ఆఫీసర్ గా సాయిపల్లవి నక్స్లైట్ గా కనిపించనున్నారు. అప్పటి రాజకీయ అంశాలను ప్రధానంగా తీసుకుని అప్పటి రెండు రాష్ట్రాల పరిస్థితులను కథలో చూపనున్నారు. ఇందులో ప్రముఖంగా బాబ్రీమసీదు కూల్చివేత, అప్పట్లో బాగా ఫేమస్ అయిన ఏక్తా యాత్రను కూడా చూపించనున్నారట.
సురేష్ బాబు,
సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రానికి
సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.
చాలా రోజుల కిందే విరాట పర్వం 1992 సినిమాకు ఓకే చెప్పింది సాయిపల్లవి. ఈ
సినిమా ఓపెనింగ్
జూన్ 15 ఉదయం 10.30 నిమిషాలకు రామానాయుడు స్టూడియోస్లో జరగనుంది. ఇదే విషయాన్ని అఫీషియల్గా ఫేస్ బుక్ పేజీలో అప్ డేట్ చేసాడు దర్శకుడు వేణు. సాయిపల్లవి నక్సలైట్ అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. అసలు ఆమెలో ఓ నక్సల్ను చూడటం చిన్న విషయం కాదు. మరి ఈ పాత్రలో ప్రేక్షకులు సాయిపల్లవిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. కానీ అమ్మడు నటనపై ఉన్న నమ్మకంతో దర్శకులు మాత్రం డేరింగ్ రోల్స్ ఆమె కోసం రాసుకుంటున్నారు. ఈ
సినిమా పూర్తిగా లేడీ ఓరియెంటెడ్గా తెరక్కబోతుంది. ఈ
సినిమా చిత్రీకరణ
వరంగల్ జిల్లాలోని పరకాల ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి బస్టాండ్లో ఓ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.