అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. విడుదలైన రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. సామజవరగమన, రాములో రాములా పాటలు యూటూబ్లో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తున్నాయి. 2020 జనవరి 12వ తేదీన అల వైకుంఠపురములో సినిమా విడుదల కాబోతుంది. 
 
ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే బాస్ పాత్రలో కనిపిస్తూ ఉండగా అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ కొలీగ్స్ పాత్రల్లో నవదీప్, రాహుల్ రామకృష్ణ కనిపించబోతున్నారు. అలనాటి హీరోయిన్ టబు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. సుశాంత్, నివేతా పేతురాజ్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులే అయినప్పటికీ ఈ సినిమా కథ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న పూజా హెగ్డే తన పాత్ర గురించి చెప్పింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే మధ్య వచ్చే లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతోంది. 
 
ప్రస్తుతం త్రివిక్రమ్ సామజవరగమన సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్, సితార ఎంటర్  టైన్ మెంట్స్ బ్యానర్ పై సంయుక్తంగా అల వైకుంఠపురములో సినిమాను  నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పాటలు, స్టిల్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా జనవరి 12వ తేదీనే విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల్లో ఎవరి సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: