టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రష్మిక మందన్నల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండగా, మరొక నటి సంగీత మరియు కమెడియన్ బండ్ల గణేష్ కూడా చాలా రోజుల తరువాత వెండితెరపై కనపడనున్నారు. ఇకపోతే ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. రెండు రోజుల క్రితం కేరళ చేరుకున్న ఈ సినిమా యూనిట్, ఒక గ్రూప్ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా అధికారిక టీజర్ ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందు సినిమా యూనిట్, నేడు టీజర్ కు సంబందించిన సీన్స్ ని కట్ చేయడం జరిగిందట. రెండు యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్స్ సీన్స్ కలబోతగా ఈ టీజర్ సాగుంతుందని, 

అలానే టీజర్ ని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నారని నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఇక టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అని సినిమా యూనిట్ ఎంతో నమ్మకంగా ఉందట. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ని కూడా అతి త్వరలో ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రంగం సిద్ధం చేస్తోందట. ముందుగా ఒక రొమాంటిక్ డ్యూయెట్ ని రిలీజ్ చేయనున్నారని టాక్. మరి సంక్రాంతి కానుకగా జనవరి 12న రియలైజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: