త్రివిక్రమ్..
అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న
సినిమా అల వైకుంఠపురంలో.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమాపై అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం
సినిమా షూటింగ్
ఫ్రాన్స్ లో జరుగుతున్నది. ప్యారిస్ లో
సినిమా సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటె, ఈ సినిమాలో మెయిన్ కీ రోల్ చేస్తున్న అక్కినేని
సుశాంత్ పాత్రకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
దీనికి సంబంధించి
సుశాంత్ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు.
సుశాంత్ డబ్బింగ్ చెప్తున్నట్టు తన
ట్విట్టర్ ద్వారా తెలిపాడు. వచ్చే ఏడాది
జనవరి 12 వ తేదీన
సినిమా రిలీజ్ కాబోతున్నది. త్రివిక్రమ్..
అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో
సినిమా ఇది. పూజ హెగ్డే
హీరోయిన్ గా చేస్తున్నది. ఇదిలా ఉంటే.. అల వైకుంఠపురంలో కథ ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అల వైకుంఠపురంలో అనే ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి. అందులో ఒకటి యజమాని కుటుంబం కాగా మరొకటి
డ్రైవర్ కుటుంబం. కానీ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు. ఇద్దరికీ ఒకేసారి మగపిల్లలు పుడతారు.
అందులో ఒకరు యజమాని కొడుకు
అల్లు అర్జున్ కాగా,
డ్రైవర్ కొడుకు సుశాంత్... కానీ వీరి భవిషత్తుపై చర్చ వచ్చినప్పుడు మాత్రం
డ్రైవర్ మాట్లాడుతూ
డ్రైవర్ కొడుకు డ్రైవరే అవుతాడని అంటాడు. ఈ క్రమంలో
డ్రైవర్ కొడుకును యజమాని, యజమాని కొడుకును
డ్రైవర్ తీసుకుని పెంచుకుంటారని టాక్ వస్తోంది. ఇక
తమన్ మ్యూజిక్ కూడా బాగా కలిసొచ్చింది. ఈ పాట విడుదలైన రెండు రోజుల్లోనే
కోటి వ్యూస్ సాధించింది. ఇక లైక్స్లో కూడా సామజవరగమన సాంగ్ సంచలనాలు రేపుతుంది. ఇక ఇటీవలే ఈ చిత్రం
కాకినాడ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
అల్లు అర్జున్ కొత్త లుక్లో కనిపించనున్నాడు.