బాహుబలి తర్వాత రాజన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్.. మల్టీస్టారర్ కథనం తో రానున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది.. ఇకపోతే ఈ సినిమా మొదలై దాదాపుగా ఏడు నెలలు దాటింది కానీ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం..


ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో కీలక సన్నివేశాలు తెరకెక్కస్తున్నారు.. రాత్రి రామ్ చరణ్ సన్నివేశాలను.. పగలు ఎన్టీఆర్ కు సంబందిచిన సన్నివేశాలను తెరెక్కిస్తున్నారు. ఇకపోతే జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించడానికి బాలీవుడ్ స్టార్స్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. అలియా భట్, అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.


ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఇక బిజీగా వీరిద్దరి మద్య సాగే సన్నివేశాలను పూర్తిగా తెరకెక్కించిన తర్వాత జూనియర్ కి కొద్దిరోజులు విశ్రాంతి ఇవ్వాలని రాజన్న ఆలోచిస్తున్నారట..


రాంచరణ్ కు మాత్రం ఇంకా హిరోయిన్ కొరత ఉండనే ఉంది. మరి రెండో హీరోయిన్ గా ఈ అమ్మడు దిగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.. డి వి వి ఎంట్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తిగా అయ్యేదానికి టైమ్ పడుతుంది.. ఇకపోతే వచ్చే ఏడాది జూలై 30  న ప్రేక్షకుల ముందుకు రానుందని సమచారం..


చాలా కాలం గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ రేంజులో హిట్ అవుతుందో చూడాలి..ఇది ఒకే మరి నెక్స్ట్. ప్రాజెక్ట్ ఎవరితో నో అని సినీ ఇంస్ట్రీలో ఆలోచనలు మొదలయ్యాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: