యంగ్ హీరో
శర్వానంద్ గత మూడేళ్ళుగా ఫుల్ ఫాం లో ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసాడు. మిగతా యంగ్ హీరోలతో చూస్తే హిట్లు.. ప్లాప్ లను సమానంగా ఉండటంలో బ్యాలెన్స్ చేయగలిగాడు. అయితే ప్రస్తుతం
టాలీవుడ్ లో బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి సినిమాని మొదటి సినిమాగానే చూడాలి..బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి. లేదంటే రేస్ లో వెనకబడటం ఖాయం. కానీ
శర్వానంద్ ఆ విషయంలో వెనుకబడే ఉన్నాడు. పడి పడి లేచే మనసు- రణరంగం సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో శర్వా ఎంచేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడట. హిట్ పడే కథ కోసం ఎదురు చూస్తున్నాడట.
ప్రస్తుతం శర్వా
96 రీమేక్ లో నటిస్తున్నాడు.
సమంత కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సి.
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ
సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రాజుగారితో పాటు శర్వా చాలా ఆశలు పెట్టుకున్నారు.
నిర్మాత ఎంతో ఇష్టపడి ఎంచుకున్న కథ పైగా.. ఆయన జడ్జిమెంట్ పై నమ్మకంతో శర్వా వెంటనే ఓకే చేశాడు. ఈ నేపథ్యంలో
96 పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ఇక్కడే శర్వా పెద్ద పొరపాటు చేశాడని ఫిల్మ్
నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఒక
సినిమా సెట్స్ లో ఉంగానే మరో సినిమాకు కాల్షీట్లు కేటాయించే శర్వా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేనట్లే కనిపిస్తోంది.
ఇక ప్రస్తుతానికి
96 తప్ప కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. శ్రీకారం.. కీరవాణి అనే రెండు స్క్రిప్టులు విన్నట్లు ప్రచారం జరిగినప్పటికి వాటికి సంబంధించి ఎలాంటి క్లారిటి ఇప్పటి వరకు లేదు. అయితే ఇప్పటివరకూ ఒప్పుకున్న కథల్ని తిరిగి బెటర్ మెంట్ చేయాలని దర్శక, రచయితలకు చెప్పాడట. వరుస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో ఈసారి కథల విషయంలో కేరింగ్ ఎక్కువైనట్లే కనిపిస్తోంది. ఒకటికి రెండు సార్లు స్క్రిప్టుని
చెక్ చేసుకోమని..అవి వర్కౌట్ అవుతాయా లేదా? అన్నది రివ్యూలు చేస్తున్నాడట. ఇక రిలీజ్ కి రావాల్సిన
96 కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా సరిగా జరగడం లేదు. 'సరిలేరు'.. మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి
96 ని పక్కన పెట్టి దిల్ రాజు శర్వా ని మోసం చేస్తున్నాడన్న టాక్ ఒకటి వినిపిస్తోంది.