నా పేరు సూర్య నిరాశపరచడంతో స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ చేస్తున్న ప్రెస్టిజియస్
మూవీ అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో
బన్ని సరసన
పూజా హెగ్దె
హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ
సినిమా నుండి రిలీజైన సాంగ్స్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్ అయ్యాయి.
ఈ
మూవీ విషయంలో
అల్లు అర్జున్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సాంగ్స్ విషయంలో అది ప్రూవ్ అయినట్టు తెలుస్తుంది. ఇక
సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందని అంటున్నారు.
అజ్ఞాతవాసి ఫ్లాప్ తో త్రివిక్రం మరోసారి తన సత్తా చాటేలా ఈ
సినిమా తీస్తున్నాడట.
హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ రెండు పెద్ద ప్రొడక్షన్స్ కలిసి చేస్తున్న ఈ
మూవీ బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవడం లేదని తెలుస్తుంది. ఇక సినిమాలో
అల్లు అర్జున్,
పూజా హెగ్దెల స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యన్స్ ను అలరిస్తుందని. ఒకప్పటి అందాల
తార టబు కూడా తన లుక్స్ తో ప్రేక్షకులను అలరిస్తారని తెలుస్తుంది.
నా పేరు సూర్య లెక్క తప్పినా
అల వైకుంఠపురములో మాత్రం అసలు ఏమాత్రం టార్గెట్ మిస్ అవకుండా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సంక్రాంతికి గట్టి పోటీ ఉంటుందని తెలుస్తున్నా ఆ పోటీలో తమదే పైచేయి అయ్యేలా చిత్రయూనిట్ జాగ్రత్త పడుతున్నారట. సాంగ్స్ లోనే కాదు బి.జి.ఎం లో కూడా
తమన్ ఇరగదీస్తున్నాడని టాక్. మొత్తానికి
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత
అల్లు అర్జున్, త్రివిక్రం హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అంటున్నాయి
ఇండస్ట్రీ వర్గాలు. మరి ఈ
సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే
జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.