డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠపురం లో' సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ‘అల వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ మరియు సీనియర్ హీరోయిన్ టబు కూడా నటించడంతో సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు అదిరిపోయే విజయాలు సాధించడంతో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేయడం తో 'అలా వైకుంఠపురం లో' సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధిస్తారని చాలా ధీమాగా ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులు.


ఇదే క్రమంలో తన చివరి విడుదలైన సినిమా నా పేరు సూర్య దారుణంగా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి అన్నివిధాలా తీవ్ర కృషి చేస్తున్నాడు అల్లుఅర్జున్. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన పాటల విషయంలో అల్లు అర్జున్ కొత్త సినిమాల కంటే అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు ముఖ్యంగా తమన్ అందించిన బాణీలకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ కి అదే రీతిలో సినిమా హాల్లో కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని అల్లుఅర్జున్ డిసైడ్ అయ్యి సినిమాలో అదరగొట్టే స్టెప్పులు వేసినట్లు వార్తలు వినబడుతున్నాయి.


ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే...ఓ కార్పొరేట్ సంస్థలో బన్నీకి బాస్ గా కనిపిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినిమాలో అల్లు అర్జున్ ని...చాలా దారుణంగా పూజా హెగ్డే ఏడిపిస్తుంది అని వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: