కొన్ని సినిమాలు కొందరికోసమే పుడతాయోమో అనిపిస్తుంది.. కీర్తి సురేష్ నటింటిన మహానటి సినిమా కూడా అంతే. ఈ సినిమాతో కీర్తి సురేశ్ ఒక్కసారిగా మహానటిగా అవతరించింది. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తికి ఈ సినిమా ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు తెచ్చి పెట్టింది.


అయితే ఒక్కోసారి ఎంత అదృష్టమో అనుకున్న విషయాలు తర్వాత కాలంలో బెడిసికొడుతుంటాయి కూడా. కీర్తి సురేష్ విషయంలోనూ అదే జరిగింది. అలాంటి పాత్రల‌కైనా రెడీ అంటోంది. కీర్తి సురేశ్. కీర్తి సురేష్ అన‌గానే ఇప్పుడంద‌రికీ మ‌హాన‌టి సినిమానే గుర్తుకొస్తుంది.


కేవలం ఆ ఒక్క సినిమాతో అంత‌గా ఆమె ప్రేక్షకుల‌పై చెరగని ముద్ర వేసింది. ఆ సినిమా ఆమె కెరీర్‌ని కూడా మ‌లుపు తిప్పింది. మ‌హాన‌టితో వ‌చ్చిన గుర్తింపుని నిల‌బెట్టుకోవాల‌నే త‌ప‌న కనిపిస్తోంది. అందుకే నాయికా ప్రాధాన్యమున్న పాత్రల‌పైనే దృష్టిపెట్టింది.


ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో అదే విష‌యాన్నే స్పష్టం చేస్తూ న‌ట‌న‌కి ప్రాధాన్యం ఉందంటే ఇక‌పై తాను డీ గ్లామ‌ర్ పాత్రల‌కైనా సిద్ధమే అని చెప్పుకొచ్చింది. అందాలరాశిలా అపురూపంగా క‌నిపించే కీర్తిని డీ గ్లామ‌ర్ పాత్రల్లో చూడ‌గ‌ల‌మా ? అయితే ఈ విషయంలో కీర్తి ఏమంటుంటుదండే.. `గ్లామ‌ర్ పాత్రలతో డ‌బ్బు చాలా సంపాదించొచ్చు. అలాంటి అవకాశాలు కూడా బోలెడ‌న్ని వ‌స్తున్నాయి. కానీ వాటిని చేసి ఏం లాభం? ఎప్పటికీ ఆ పాత్రలు ప్రేక్షకుల ప్రశంస‌లు పొంద‌లేవు.


నావ‌ర‌కు నేను చేసుకొని సంతృప్తి ప‌డాలంతే. అదే న‌ట‌న‌కి ప్రాధాన్యమున్న పాత్ర చేశాన‌నుకోండి. వాటి గురించి కొన్నాళ్లపాటు మాట్లాడుకుంటారు ప్రేక్షకులు. అలా గుర్తుండిపోయే పాత్రలు చేయ‌డంలో ఉన్న ఆనందమే వేరు క‌దా అంటోంది కీర్తి సురేష్.


అయితే ఇక్కడ నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలు, గ్లామర్ పాత్రలు అంటూ గిరిగీసుకోవాల్సిన అవసరం లేదు. కథలో లీనమయ్యేలా చేసి.. ఆ కథ ద్వారా సినిమా నడిస్తే..ఆ సినిమాలో నటించిన ఐదుగురు సూపర్ అంటున్నారు సినీ జనం.


మరింత సమాచారం తెలుసుకోండి: