దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర బాహుబలి సినిమాలు రాజమౌళికి మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి పేరును తీసుకువచ్చాయి. ముఖ్యంగా ఈ రెండు సినిమాలలో మొదటిగా మగధీర సినిమాలో రామ్ చరణ్ 100 మందితో చేసిన ఫైట్ సినిమా మొత్తానికి హైలెట్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అయి టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది. ఇక బాహుబలి విషయంలో కూడా ఇదే జరిగింది. యుద్ధ పోరాట సన్నివేశాలలో ప్రభాస్ దాదాపు 100 మందికి పైగానే పోరాడుతూ ఫైట్ చేయడం జరిగింది. దీంతో సినిమా ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాల కంటే అంతకుమించి రాబోతున్న సినిమాలో బాలయ్య బాబు అనగా 'రూలర్' సినిమాలో దాదాపు 500 మందితో ఫైట్ చేస్తున్న సన్నివేశం ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


దాదాపు ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబుకి రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ కావడంతో అదే సమయంలో ఎన్నికలు రావడంతో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య బాబు హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలలో బిజీగా ఉన్న బాలయ్య బాబు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే కేఎస్ రవికుమార్ దర్శకత్వం 'రూలర్' అనే సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల చాలా చురుగ్గా పాల్గొని చాలా తొందరగా కంప్లీట్ చేసిన బాలయ్య బాబు ఈ సినిమాలో ధర్మ అనే మాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్స్ గా  సోహాల్ చౌహన్, భూమిక చావ్లా నటిస్తున్నారు. డిసెంబర్ లో విడుదల కాబోయే ఈ సినిమా పై బాలకృష్ణ అభిమానులు భీభత్సంగా అంచనాలు పెట్టుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో 500 మంది ఫైటర్స్ తో ఒక భారీ పోరాట సన్నివేశాలలో బాలకృష్ణ నటిస్తున్నరాన వార్తలు బయటకు రావడంతో సినిమాపై ఇప్పుడు ఉన్న అంచనాల కంటే మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. డిసెంబర్ 20న 'రూలర్'  సినిమా విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: