రాక్ స్టార్ యాష్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా హోంబలె ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన భారీ యాక్షన్
మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1. గత ఏడాది కన్నడంతో పాటు పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి, అన్నింటా సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీన్స్, వండర్ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఒళ్లు గగుర్పొడిచే ఫైట్స్, నటీనటుల అత్యద్భుత నటన వెరసి ఈ సినిమాకు అంత పెద్ద విజయాన్ని అందించాయి. వాస్తవానికి
టాలీవుడ్ దర్శకుడు
రాజమౌళి,
సినిమా యూనిట్ ఆహ్వానం మేరకు తొలుత ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్స్ చూసిన తరువాత, దీనిని కేవలం
కన్నడ భాషకు మాత్రమే పరిమితం చేయకుండా,
హిందీ సహా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయమని సలహా ఇచ్చారట. ఆయన సలహా మేరకే ఈ సినిమాను మిగతా భాషల్లో రిలీజ్ చేసి మంచి
సక్సెస్ ని అందున్నాం అని ఆ
సినిమా యూనిట్ కూడా ఇటీవల తెల్పడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా చాప్టర్ 2 షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. చాప్టర్ 1 ని మించేలా ఈ సినిమాలో మరిన్ని యాక్షన్, ఫైట్ సీన్స్ మరియు విజువల్స్ ఉండనున్నట్లు సమాచారం. రాబోయే సమ్మర్ లో ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ
సినిమా తరువాత దర్శకుడు
ప్రశాంత్ నీల్,
మన
టాలీవుడ్ నటుడైన
సూపర్ స్టార్ మహేష్ బాబుతో
సినిమా చేయడం ఖాయమైనట్లు నేడు ఫిలిం
నగర్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.
మహేష్ ని ఇటీవల కలిసిన
ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించడం, అది ఎంతో నచ్చిన
మహేష్, చాప్టర్ 2 రిలీజ్ పూర్తయిన వెంటనే దీనిని ప్రారంభిద్దాం అని మాట కూడా ఇవ్వడం జరిగిందట. ఇక ఈ సినిమాను
మహేష్ మరియు
అనిల్ సుంకర కలిసి నిర్మించనున్నారని, అలానే
కెజిఎఫ్ మాదిరి ఈ
సినిమా కూడా పాన్
ఇండియా అపీల్ తో
హిందీ సహా పలు భారతీయ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అతి త్వరలో ఒక అధికారిక ప్రకటన కూడా రాబోతోందట.....!!