టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు గా చిన్ననాడే తన సత్తా ఎంటో చూపించారు. రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ మూవీతో హీరో అవతారం ఎత్తిన ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకు వెళ్లాడు.  టెంపర్ సినిమా తర్వాత జనగా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ సినిమాలతో విజయాలు అందుకుంటూ వచ్చాడు.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నాలుగో మూవీ ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యుల్ పూర్తీ చేసుకొని ఎన్టీఆర్ ఖాళీగా ఉన్నారు.

రెండవ షెడ్యుల్ తో రామ్ చరణ్ బిజీ గా ఉన్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా ఎన్టీఆర్ యాడ్స్ రంగంలోకి అడుగు పెట్టనున్నారట. కేవలం సినిమాల్లోనే కాదు ఆ మద్య బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాల్టీ షోతో బాగా ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఇక టెలివిజన్ లో కొన్ని యాడ్స్ లో కూడా కనిపిస్తున్న ఎన్టీఆర్ తాజాగా యాపీ ఫిజ్‌ డ్రింక్‌కు దక్షిణభారత బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తారని తయారీ సంస్థ పార్లే ఆగ్రో తెలిపింది. ఈ వేసవిలో జరిగే ప్రచార కార్యక్రమాలలో ఎన్టీఆర్ పాల్గొంటున్నరట. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో పార్లే ఆగ్రో సంస్థకు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా. ఇటీవలే కర్నాటకలోని మైసూరులో కొత్తగా ప్లాంట్‌ను ప్రారంభించింది.

ఇక యాపీ ఫిజ్ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. "యాపీ ఫిజ్ తో కలిపి మీకు నచ్చిన ఏ ఆహారాన్ని జతగా తీసుకుంటే బాగుంటుంది? సమాధానం చెప్పి, మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలని కోరాడు. అంతే కాదు త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్టు ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: