బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఒక నటుడుగానే కాకుండా ఓ
ప్రొడ్యూసర్ గా, ఓ డైరెక్టర్గా కూడా మంచి టేస్ట్ ఉన్న హీరో. ప్రస్తుతం ఆయన మైదాన్ అనే
ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కతున్న చిత్రంలో నటిస్తున్నారు. అమిత్ రవీంద్రనాధ్ శర్మ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ప్రముఖ
ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్ర పోషించనున్నారు.
అజయ్ దేవగన్ కి జంటగా తెలుగులో
మహానటి సావిత్రి పాత్రలో ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించిన కీర్తిసురేష్ నటించనున్నారు. అమిత్ షర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం మూడవ షెడ్యూల్ ను ముంబయిలో షూట్ పూర్తి చేసుకున్నారు.ఈ చిత్ర కథ మొత్తం
ఫుట్ బాల్ లో మన భారతదేశం మంచి విజయం సాధించిన విషయాల నేపధ్యంలో సాగుతుంది. ఈ చిత్ర దర్శకులు ఇటీవలె ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను
ముఖేష్ మిల్స్ లో చిత్రీకరించారు. చిత్ర షూటింగ్ కోసం మిల్ లో ఓ సెట్ ను కూడా ఏర్పాటు చేశారు. లాస్ యాంజిల్స్ నుంచి విఎఫ్ఎక్స్, మరియు స్పోర్ట్స్ కొరియోగ్రాఫర్ ని చిత్రం కోసం పనిచేయుటకు పిలిపించారు.1951 నుంచి 1953 వరకు సయ్యద్ అబ్దుల్
ఇండియన్ నేషనల్ కోచ్ గా పని చేస్తున్నారు.
ఇకఈ చిత్రం వచ్చే ఏడాది
నవంబర్ 27నముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఒక బయోపిక్గా తెరకెక్కుతోంది.
కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్స్ల ఒకరుగా రాణిస్తున్నారు. 'మహానటి'తో స్టార్ స్టేటస్తో పాటు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది కీర్తి. ఈ సినిమాలో
సావిత్రి పాత్రలో
కీర్తి సురేష్ జీవించేసింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది. కాగా 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన
కీర్తి సురేష్ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న
కీర్తి, ఆ తర్వాత మంచి నటిగా రాణిస్తూ.. కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.