తెలుగు సినిమా పరిశ్రమలో కుటుంబాల ఆధిపత్యం ఎక్కువ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, అల్లు కుటుంబాల నుంచి మూడో తరం కూడా టాలీవుడ్ లో నటిస్తున్నారు. కృష్ణ, చిరంజీవి కుటుంబాల నుంచి రెండో తరం వాళ్లు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం వారసత్వపరంగా ఇండస్ట్రీలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది. కానీ వీరందరికి ఈ నందమూరి ఆశాకిరణం షాకిచ్చేట్టున్నాడు.

 


మెక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడని బాలకృష్ణకు మీడియా, అభిమానులు, ఇండస్ట్రీ నుంచి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ.. మోక్షజ్ఞకు సినిమాలపై కంటే బిజినెస్ మేన్ గా ఎదగాలని ఉందనే టాక్ ఫిలింనగర్ లో వినపడుతోంది. దీనిపై బాలకృష్ణ కూడా సందిగ్ధంలో ఉన్నాడని సమాచారం. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఎక్కడా వ్యాఖ్యలు చేయటం లేదని అంటున్నారు. ‘డిగ్రీ పూర్తయ్యాక వస్తాడు.. వచ్చే ఏడాది ఉంటుంది’  అనే సమాధానాలు ఇదివరకు విన్నాం. అమెరికాలో నటనకు, డ్యాన్స్ కు సంబంధించిన కోర్స్ చేస్తున్నాడని.. బొద్దుగా ఉన్నాడు.. స్లిమ్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ పై  నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తాడని కూడా వార్లు షికారు చేశాయి.

 


సినిమా టైటిల్ గా ‘రానే వచ్చాడు రామయ్య’ అని ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించేశాడని కూడా అన్నారు. కానీ ఇవేమీ వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనిపించటం లేదని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పబ్లిక్ లైఫ్ కు ఎక్కువ స్పాన్ ఉన్న సినిమా, రాజకీయాల్లో  వారసత్వం ఉండాలని.. తమ కీర్తిని వారసులు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశపడతారు. ఇందుకు నటసింహం బాలకృష్ణ మినహాయింపు కాదు. మరి.. ఈ వార్తలపై నిజానిజాలు తేలాలంటే బాలకృష్ణ నోరు విప్పాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: