బాలీవుడ్ నటి సుస్మిత సేన్ మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం. నాగార్జున సరసన రక్షణ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించారు. మిస్ ఇండియా యూనివర్స్ గా 1994లో భారత దేశం తరపున గెలిచిన సుస్మిత, ఆ తరువాత పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి నటిగా అక్కడ బాగా పేరు సంపాదించారు. మొదటి నుండి మానవ బంధాలు, సంబంధాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే సుస్మిత, ఆపదలో ఎవరైనా ఉంటె ఆమె ఎంతో చలించిపోతారని ఆమె సన్నిహితులు పలువురు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక తన 24 ఏళ్ళ వయసులో రీనా అనే అమ్మాయిని దత్తత తీసుకుని అప్పటినుండి ఎంతో ఆప్యాయంగా పెంచుతున్న సుస్మిత, 

ఇటీవల అలీషా అనే మరొక పాపను కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం తన కూతుళ్ళిద్దరితో కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తున్న సుస్మిత, నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ లో ఒక హ్రద్యమైన వీడియో పోస్ట్ చేశారు. తన చిన్న కూతురు అలీషా, మొన్న తమ స్కూల్ లో జరిగిన వ్యాసరచన పోటీలో దత్తత అనే అంశంపై రాసిన వ్యాసాన్ని చదివి తన కంట కనీరు ఆగలేదని, ఆ వ్యాసం చదివిన నా మనసు ఎంతో చలించిపోయిందని అన్నారు. ఇక ఆ వ్యాసాన్ని చదువుతున్నపుడు తీసిన వీడియోని పోస్ట్ చేసారు సుస్మిత. ఒక చిన్నారిని కాపాడి జీవితం ఇచ్చావు, అంతేకాక ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సంరక్షణ, స్వచ్ఛత, 

భద్రత, నిజాయితీలోని శక్తీ ఆమెకు పంచావు అంటూ దత్తత పై అలీషా రాసిన వ్యాసం నా హృదయాన్ని కలిచివేసింది. దత్తత తీసుకోవడం అంటే హృదయం నుండి ఒక బిడ్డకు జన్మను ఇవ్వడం అంటూ ఎంతో భావోద్వేగంగా సుస్మిత తన పోస్ట్ లో తెలిపారు. తనకున్న ఇద్దరు బిడ్డలు దేవుడిచ్చిన వరం అని, వారికి ఆ భగవంతుడు మంచి జీవితాన్ని అనుగ్రహించాలని, అలానే తల్లిగా తాను వారికోసం ఏమి చేయడానికైనా సిద్దమే అని సుస్మిత తన ఇంటర్వూల్లో పలు మార్లు చెప్పడం జరిగింది. కాగా ఆమె పోస్ట్ చేసిన ఆ వీడియో పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: