బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరి చూపు దాని మీదే పడింది. ఎంత కాదనుకున్నా ఇప్పుడు ప్రతీ డైరెక్టర్ కి బాహుబలి ఒక బెంచ్ మార్క్ లా అయిపోయింది. ఆ బెంచ్ మార్క్ ని దాటి తాము కూడా బాహుబలిని బీట్ చేసే సినిమా తీయాలని అనుకుంటున్నారు. అయితే దీనిపై బాలీవుడ్ లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పద్మావత్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి సినిమాలు అలా వచ్చినవే.


అయితే అదే ప్రయత్నంలో బాలీవుడ్ లో మరో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పానిపట్" మరి కొద్ది రోజుల్లో విడుదల అవుతుంది. ఇటీవల  ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అప్పుడే ముఫ్పై మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ, బాహుబలిని కాపీ కొడుతున్నారేమో అనిపిస్తుంది. పానిపట్ చిత్రం నుండి విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్ లో చూపించిన సన్నివేశాల ప్రకారం బాహుబలిని కాపీ కొట్టినట్టు కనిపిస్తున్నాయి.


అర్జున్ కపూర్, సంజయ్ దత్, కృతిసనన్ లాంటి పెద్ద తారలు ఉండడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. కానీ అశుతోష్ గోవారికర్ తీసిన మొహంజొదారో సినిమా గుర్తొచ్చినవారు భయపడుతున్నారు. ఆ సినిమా ఎంతలా ఆడిందో అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. అయితే అలా అని చెప్పి అశుతోష్ గోవారికర్ ని తక్కువ అంచనా వేసే అవకాశం లేదు.


ఎందుకంటే లగాన్, జోధా అక్బర్ లాంటి తీసింది కూడా అతనే అని గుర్తుంచుకోవాలి. మరి ఈ సినిమా కూడా లగాన్ లా అవుతుందా లేదా చూడాలి. ఏదేమైనా ఈ సినిమా పోస్టర్లు మొదలగు వాటిలో బాహుబలిని కాపీ కొట్టినట్లు కనిపిస్తుంది. బాహుబలిని కాపీ కొట్టడం సరే కానీ బాహుబలి రికార్డుని బ్రేక్ చేయగలదా అనేదే సందేహం.



మరింత సమాచారం తెలుసుకోండి: