అల్లరి నరేష్ గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. హీరోగా సినిమాలు కూడా చాలా తగ్గించాడు. ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసిన
నరేష్ ప్రస్తుతం ఏడాదికి ఒక
సినిమా కూడా చేయట్లేదు. చేసినా కూడా అవి జనాల వరకి వెళ్ళట్లేదనేది వాస్తవం. ఒకప్పుడు మంచి
కామెడీ సినిమాలు చేసి మినిమమ్ గ్యారెంటీ
హీరో అని పేరు తెచ్చుకున్నాడు. అయితే మొన్న వచ్చిన
మహర్షి సినిమాలో తన పాత్ర జనాలకి బాగా గుర్తుండిపోయింది.
సినిమాలోని కీలక మలుపు ఆ పాత్ర ద్వారా ఉండడం వల్ల ఆ పాత్రకి మంచి పేరొచ్చింది. దీంతో
అల్లరి నరేష్ మళ్లీ ట్రాక్ లో పడ్డాడని అంటున్నారు. అయితే తెలుగు సినిమాల్లో మార్పు కారణంగానో మరే కారణంగానో సినిమాలు ఎక్కువగా చేయని
నరేష్ ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో వస్తున్నాడు. కామెడీని పక్కకి పెట్టి కాన్సెప్ట్ సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఇటీవల తెలుగు సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి.
ముఖ్యంగా కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది వరకు అన్నీ ఫార్ములా బేస్డ్ మాత్రమే వచ్చేవి. ఆ సమయంలో
అల్లరి నరేష్ కామెడీ సినిమాలు ప్రేక్షకులకు మంచి ఊరటనిచ్చేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. కాన్సెప్ట్ లోనే
కామెడీ మిక్స్ చేసి అందించడంతో
నరేష్ కామెడీ సినిమాలు ఆడలేదని అర్థం అవుతుంది. దానితో
నరేష్ కూడా తన రూటును మార్చుకుని కాన్సెప్ట్ సినిమాల వైపు వచ్చాడు.
ప్రస్తుతం బంగారు బుల్లోడు సినిమాలో నటిస్తోన్న
నరేష్ త్వరలో ఈ కాన్సెప్ట్ మూవీతో మనముందుకి వస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని
విజయ్ కనకమెడల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం చేయబోతున్నాడు. దర్శకుడు
సతీష్ వేగేశ్న నిర్మాతగా మారి
ఎస్వీ ౨ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించనున్నారు.