చోటా కే నాయుడు కవచం ఆడియో ఫంక్షన్ లో కాజల్ చోటాను పొగిడే సమయంలో చోటా ఆమెను ముద్దాడాడు, ఇంక కాజల్ ఫాన్స్, మేమ్ క్రెయేటర్స్ ఇద్దరు చోటా కే నాయుడు భరతం పట్టారు, చివరకు ఆయన వివరణ ఇచ్చేంతవరకు వెళ్ళింది వ్యవహారం.

ప్రఖ్యాత జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్ దేశాయ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు ఎమ్. ధర్మరాజు. సినిమాలోని ఒక సీన్ గురించి చెప్తూ ఉపయోగించిన "ఫసక్" అనే పదం రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది, ఆయనపై ట్రోల్స్, మీమ్స్ తో నెటిజన్లు పండగ చేసుకున్నారు.

నరేంద్ర మోడీ యోగ పట్ల అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఆయన యోగ చేసిన ఫొటోస్, వీడియోస్ వదిలారు. అంతే, ప్రధాని అని కూడా కనికరం లేకుండా ఎలా పడితే ఆలా ట్రోల్ చేసారు.

పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ సెలబ్రిటీస్ కి గౌరవం ఇవ్వండి అనే ఉద్దేశంతో నొక్కి చెప్పిన "గారు" అన్న పదాన్ని పట్టుకొని నెటిజన్లు బన్నీని ఒక ఆట ఆడేసుకున్నారు.

రిలయన్స్ 40 ఇయర్స్ ఈవెంట్ లో అతని స్పీచ్ కొన్ని వైరటీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, ఆ ఎక్స్ప్రెషన్స్ ని పట్టుకొని ఒక రేంజ్ లో మేమ్స్ చేసారు నెటిజన్లు.

బాలకృష్ణ సహజంగానే మాట్లాడేటపుడు బాలయ్య తడబడుతూ ఉంటారు. అలాంటిది "సారే జహ సే అచ్ఛా " అంటూ  దేశ భక్తి గీతాన్ని పాడే సాహసం చేసి "బుల్ బుల్" అంటూ బుక్కయ్యారు , ఇంకేముంది నెటిజన్లు చేతికి పని చెప్పారు.

ఇలాంటి లిస్టులో మంచులక్ష్మీ పేరు లేకపోతే ఎలా ..??ఓటు హక్కు గురించి మాట్లాడే సమయంలో మంచు లక్ష్మి "నిలదీసిఫై" అనే ఒక పదం వాడింది, నోరు జారి ఆ పదం వాడిందో, లేక అదేదైనా పరభాషా పడమో తెలీదు కానీ ఆ పదాన్ని పట్టుకొని నెటిజన్లు తెగ ట్రోల్ చేసారు.

Image





మరింత సమాచారం తెలుసుకోండి: