ఈ మద్య స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మరో స్టార్ హీరో వెళ్లడం కామన్ అయ్యింది. ఈ విషయాన్ని పోస్టర్స్ ద్వారా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై క్యూరియాసిటీ పెంచుతున్న విషయం తెలిసిందే. అయితే చిన్న హీరోల సినిమాలకు సైతం స్టార్ హీరోలు వెళ్తు..ఆ చిత్ర యూనిట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు.  సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్‌ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తూ..విద్యార్థి పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో 1965 నుంచి 1975 మ‌ధ్య ఎన్నో ఉద్య‌మాలు న‌డిపిన విద్యార్ధినాయ‌కుడు జార్జ్ రెడ్డి.


ఆయ‌న జీవిత నేప‌థ్యంలో జార్జ్ రెడ్డి పేరుతో చిత్రం రూపొందుతుంది. 'దళం' అనే సినిమాను తెరకెక్కించిన జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 25 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థుల చేతిలో ఆయన మరణించాడు. అప్పట్లో రాజకీయాలకు ఎదురు నిలిచి విద్యార్థులను ఒక్కతాటిపై తీసుకు వచ్చి తన ప్రాణాలు పోగొట్టుకున్న ఉద్యమనాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందింది  'జార్జి రెడ్డి' .


హీరో సత్య దేవ్‌ కూడా ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ ఫ్లే చేస్తున్నారు. మరాఠీ నటి దేవిక 'జార్జి రెడ్డి' తల్లి పాత్రలో కనిపించబోతుంది.  తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  ముఖ్య అతిధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కాబోతున్నారని అంటున్నారు. వెన్యూ వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్లడించ‌నున్నారు. మైక్ మూవీస్, 3 లైన్స్ మూవీస్, సిల్లీ మంక్స్ స్టూడియోపై అప్పిరెడ్డి, దాము రెడ్డి, సుధాకర్ యక్కంటి నిర్మిస్తున్నారు.  న‌వంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబ‌ర్ 17న జ‌ర‌గ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: